తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అజిత్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. వరుస విజయాలతో ఆయన క్రేజ్ పెరుగుతూపోతోంది.  ప్రముఖ అజిత్‌ తన అరవై చిత్రం ‘వాలిమై’గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.  బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు నెలలుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ చిత్రాన్ని దర్శకుడు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం అజిత్ కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. 

 

అజిత్ గత చిత్రాలకు మించిన బడ్జెట్ తో వాలిమై తెరకెక్కుతుంది. ఇక ఇంతవరకూ ఈ సినిమాకిగాను కథానాయికను ఎంపిక చేయలేదు. తదుపరి షెడ్యూల్లో కథానాయిక కాంబినేషన్ సీన్స్ ఉండటంతో, ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అనే దిశగా దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. ఈ నేప‌థ్యంలోనే ఇలియానా, యామీ గౌతమ్ లాంటి పేర్లు వినబడినా ఇప్పుడు బాలీవుడ్ నటి హుమా ఖురేషి పేరు తెరపైకి వచ్చింది. ఈమెనే అజిత్ జోడీగా ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అయితే రజినీకాంత్ రంజిత్ కాంబినేషన్‌లో `కాలా` చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 

 

ఈ సినిమాలో హుమా ఖురేషి.. రజనీకాంత్ స‌ర‌స‌న న‌టించి త‌న టాలెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అంతేకాకుండా హుమా.. హిందీలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించింది. ఇక వాలిమైలో పాత్ర పరంగా చూసుకుంటే, హ్యూమా ఖురేషి అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు మొదలు పెట్టనున్నారట. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారు కావొచ్చని అంటున్నారు. ఇక  చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా వాలిమై విడుదల కానుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: