తమన్ కెరీర్ ను అల వైకుంఠపురంలోకు ముందు.. ఆ తర్వాత అని చెప్పొచ్చు. అల వైకుంఠపురంలో మ్యూజిక్ హిట్ తర్వాత సూపర్ స్టార్ దృష్టి తమన్ పై పడింది. తర్వాతి మూవీ తమన్ మ్యూజిక్ అందిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. 

 

సంక్రాతికి వచ్చిన అల వైకుంఠపురంలోకు తమన్.. సరిలేరు నీకెవ్వరుకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ పరంగా తమన్ డామినేట్ చేశాడు. రీసెంట్ గా జరిగిన అల వైకుంఠపుంలో సక్సెస్ మీట్ లో సినిమా సక్సెస్ క్రెడిట్ ను త్రివిక్రమ్, బన్నీ.. తమన్ కే ఇచ్చేశారు. 

 

అరవింద సమేత వీర రాఘవ మొదలు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తనని తాను మార్చుకుంటూ.. సిట్యువేషనల్ సాంగ్స్ తో తమన్ బైటకొచ్చాడు. అల వైకుంఠపురంలోనూ మ్యూజికల్ హిట్ గా నిలిపి టాప్ పొజిషన్ కొట్టేశాడు తమన్. దీంతో సూపర్ స్టార్ కన్ను ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పై పడింది. 

 

మహేశ్, తమన్ కాంబినేషన్... దూకుడు లాంటి మ్యూజికల్ హిట్ తో మొదలైంది. బిజినెస్ మేన్ తో మరో హిట్ అందుకున్నాడు. ఆగడు ఫ్లాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాలేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్, వంశీ పైడిపల్లి కలయికలో వచ్చే సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను సంప్రదించినట్టు తెలిసింది. 

 

మొత్తానికి  అలవైకుంఠ పురములో తమన్ మ్యూజిక్ మ్యాజిక్ సినీ జనాల్ని ఉర్రూతలూగించింది. ఎవరినోట చూసినా ఆ సినిమా పాటలే వినిపిస్తున్నాయంటే ఆ మూవీ  మ్యూజికల్ గా ఎంత హిట్ సాధించిందో చెప్పవచ్చు. ఇదే మహేశ్ బాబును విపరీతంగా ఆకట్టుకుంది. తన సినిమాకు తమన్ మ్యూజిక్ కావాలని కోరుకుంటున్నాడట. ఈ విషయం తెలుసుకున్న తమన్ మహేశ్ బాబుతో కలిసి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతోంది. ఇది మళ్లీ రిపీట్ అయితే మహేశ్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: