వరుసగా రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలు సాధించడంతో మహేష్ బాబు సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు ముందు నుండి పోటిగా అల్లు అర్జున్- త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అల వైకుంఠపురములో’ ప్రతి విషయంలో నువ్వానేనా అన్నట్టుగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. దీంతో ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఏ సినిమా హిట్ అవుతుందో అంటూ ఒకరిపై ఒకరు చాలెంజ్ లు చేసుకుంటూ రావడం జరిగింది.

 

అయితే రెండు సినిమాలు సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఇప్పుడు కలెక్షన్ల విషయంలో ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా హీరో రికార్డులు బ్రేక్ చేశాడు అంటే..మరొకడు మా హీరో రికార్డులు బ్రేక్ చేశాడు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో యుద్ధవాతావరణం క్రియేట్ చేస్తున్నారు. రెండు సినిమాలు రోజు తేడాతో ఒకేసారి రిలీజ్ అయిన గాని మహేష్ బాబు సినిమా కి కలెక్షన్లు తక్కువ వచ్చాయి అని అసలు సినిమా కలెక్షన్లు రాలేదు అన్నట్టుగా అల్లు అర్జున్ సినిమా యూనిట్ సభ్యులు సినిమా సక్సెస్ మీట్ లో ఇండైరెక్టుగా కామెంట్లు చేయటంతో మహేష్ అభిమానులు తీవ్రస్థాయిలో ఎవరైతే ఈ కామెంట్లు చేయడం జరిగింది సదరు వ్యక్తిని సోషల్ మీడియాలో గట్టిగా టార్గెట్ చేసి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

 

కాగా రెండు సినిమాలు దేనికది కలెక్షన్ల విషయంలో రికార్డు స్థాయిలో వసూలు కొల్లగొట్టిన మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా పై మాత్రం కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కలెక్షన్లు తక్కువ వచ్చాయి అనే నెగిటివ్ కుట్ర ప్రచారం చేశారని ఈ పరిణామంతో అల్లు అర్జున్ సినిమా కంటే 20 శాతం కలెక్షన్లు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కి రావటం జరిగాయని 'సరేలేరు...' సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు కి చెందిన వాళ్ళు. 

మరింత సమాచారం తెలుసుకోండి: