జబర్దస్త్ కామెడీ షో చూసేవారంద‌రికి హైప‌ర్ ఆది ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. హైపర్ ఆది పంచులకు అడ్డు అదుపూ ఉండదు.. స్కిట్ మొదలు పెట్టాడంటే ముగించే వరకూ పంచుల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈయన స్కిట్ వస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. జబర్దస్త్ కామెడీ షోలో ఎవరికీ లేని యూ ట్యూబ్ ఫాలోయింగ్ ఆది సొంతం అని చెప్పొచ్చు. ఆది చేసిన కామెడీ అంటే అందరూ పడిచచ్చిపోతుంటారు. తెలుగు ప్రేక్షకులకు హైపర్ ఆది కామెడీ కడుపునిండా నవ్వులు పూయిస్తూంది. హైపర్ ఆది స్టేజ్‌పై ఏ స్కిట్ వేసిన అదిరిపోవాల్సిందే.

 

ఆది స్కిట్‌లో నవ్వులతో పాటు కాంట్రవర్సీలకు కూడా కొదవే ఉండదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అసలు వివాదంలోంచి వినోదం వెతుక్కోవడమే హైపర్ ఆది స్టైల్.  తన ప్రతీ స్కిట్ కూడా వివాదానికి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈయన. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే ఆదికి కాస్త గట్స్ ఎక్కువే అనిపిస్తుంది. ఇక తాజాగా  ఆది తన స్కిట్ లో అనసూయను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కేంద్రబిందువు అయినట్లు తెలుస్తోంది. ఆది స్కిట్ లో అనసూయ డైలాగ్ చెబుతూ బావ నిద్రప్టటేసింది అనగానే ఆది అందుకొని.. ఈ షో పెట్టుకొని ముందు రోజు ఆ షోకు వెళితే నిద్రే పట్టుద్ది అంటూ పంచ్ వేశాడు. 

 

ఇక అంతటితో ఆగితే ఆది ఎందుకు అవుతారు. వీళ్లు వదులుకోరు...వాళ్లు వదులుకునేలా లేరు అంటూ అనసూయపై పంచులు వేశాడు. ఇలా జీ తెలుగులో వచ్చే లోకల్ గ్యాంగ్స్ షోపై పేరు చెప్పకుండా పంచులు వేసాడు ఆది. ఈ క్ర‌మంలోనే యాంకర్ అనసూయను అడ్డు పెట్టుకుని ఆ షోపై రెచ్చిపోయిన‌ట్టు తెలుస్తోంది. కాగా, గ‌తంలో కూడా ఈయ‌న స్కిట్ల వ‌ల్ల చాలా వివాద‌లు తెర‌తీశాయి. అప్పట్లో హిజ్రాలను టార్గెట్ చేసిన చేసిన ఓ స్కిట్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇక కత్తి మహేష్‌తో ఈయన ఆడుకున్న తీరు చాలా రోజుల పాటు వార్తల్లో నానింది.

మరింత సమాచారం తెలుసుకోండి: