క్లాసిక్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కాఫీ లాంటి పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ములా ఒక్క లీడర్ మినగా తను ఇప్పటి వరకు తీసిన సినిమాలన్ని చాలా సున్నితంగా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను బాగా హత్తుకుంటున్నాయి. డాలర్ డ్రీంస్ అనే సినిమా అందరికీ తెలీకపోయినప్పటికి ఆనంద్ సినిమాతో ఒక్కసారిగా శేఖర్ కమ్ముల బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత గోదావరి, హ్యాపీ డేస్ తో తన మార్క్ట్ ఏంటో క్లియర్ గా చూపించాడు. ఇక వరుణ్ తేజ్-సాయి పల్లవి తో తీసిన ‘ఫిదా’ తో అందర్నీ మరోసారి ఫిదా చేసిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్యసాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కిస్తున్నాడు. 

 

ఇప్పటికే ఈ సినిమా  పోస్టర్స్ , టీజర్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా సినిమా కి సంబంధించిన న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ అవుతోంది. అదే ఈ సినిమాలోని క్లయిమాక్స్. సాడ్ ఎండింగ్ తో హృదయాలను పిండేసే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను శేఖర్ కమ్ముల ఈ సినిమాలో రాసుకున్నారని తాజా సమాచారం.  నాగచైతన్య పోషించిన హీరో పాత్ర చనిపోగా.. అతని జ్ఞాపకాలతో సాయి పల్లవి పోషించిన పాత్ర జీవితాన్ని కొనసాగిస్తుందట. ప్రేక్షకులతో కంటతడి పెట్టించే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ పల్లెల నుంచి వచ్చి హైదరాబాద్ లో మంచి కెరీర్ కోసం చూసే ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. 

 

ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారట. కెరీర్ లో ఫస్ట్ టైమ్ నాగచైతన్య తెలంగాణ యాస లో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒకవేళ ఇదే గనక క్లైమాక్స్ అయితే మాత్రం ఆడియన్స్ ని కన్విన్స్ చేయగలిగితే పక్క సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. సాధారణంగా మన తెలుసు సినిమాలలో హ్యాపి ఎండింగ్ ఇస్తుంటారు దర్శకులు. కాని వాళ్ళకి భిన్నంగా ట్రై చేస్తున్న శేఖర్ ట్రీట్ మెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: