టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బన్నీ ఒక మధ్యతరగతి యువకుడిగా నటించగా, పూజ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో గా నటించడం జరిగింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బాగానే టాక్ వచ్చింది. నిజానికి సినిమాలో చెప్పుకునేంత గొప్ప అంశాలు ఏవి లేవని, అదీకాక గతంలో త్రివిక్రమ్ తీసిన అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల్లోని సీన్లు ఈ సినిమాలో కొన్ని చోట్ల స్పష్టంగా కనపడతాయని కొందరు ఆడియన్స్ బహిరంగంగానే విమర్శించారు. అయితే ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే కొన్ని ముఖ్యమైన సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడంతో పాటు సంక్రాంతి సీజన్ కావడం ఈ సినిమాకు మంచి మేలు చేసింది. 

 

ఇక ఎట్టకేలకు మంచి కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాపై ఫేక్ రికార్డుల ముద్ర కొనసాగుతోంది. నిజానికి ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని సంపాదించడం జరిగింది. అయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ స్టామినా, అలానే పండుగ సీజన్ కావడంతో ఆ సినిమాకు కూడా మంచి కలెక్షన్స్ లభించాయి. ఇక లెక్కల విషయానికి వస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు దున్నేస్తుంటే, ఓవర్సీస్ లో అల బాగా కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇక తొలిరోజు నుండి సరిలేరు సినిమా ప్రకటిస్తున్న కలెక్షన్స్ కు మించేలా అల టీమ్ తమ సినిమా కలెక్షన్స్ ప్రకటిస్తూ ఉండడంతో కొద్దిరోజలుగా చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి ఇటీవల ఈ రెండు సినిమాలు కూడా రూ. 100 కోట్ల షేర్ అందుకున్న మాట నిజమేనని, అయితే రెండు రోజుల క్రితం సరిలేరు టీమ్ తమ  సినిమాకు 9 రోజులకు గాను రూ. 117 కోట్ల షేర్ ని ప్రకటించగా, 

 

అల మూవీ టీమ్ 9 రోజులకు గాను రూ.118 కోట్ల షేర్ ప్రకటించిందని, అలానే సరిలేరు టీమ్ 10  రోజుల వరల్డ్ వైడ్ షేర్ రూ.124 కోట్లు ప్రకటించగా, అల మూవీ టీమ్ 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 137 కోట్ల షేర్ ప్రకటించడంలోనే ఆ సినిమా వారు ఎంత ఫేక్ చేస్తున్నారో అర్ధం అవుతుందని కొందరు విశ్లేషకులు బహిరంగంగానే అంటున్నారు. కేవలం ఒకే ఒక్క రోజులో దాదాపుగా 20 కోట్ల షేర్ రావడం అసాధ్యం అని, ఎందుకంటే ఇప్పటికే పాతబడిన ఈ సినిమాలకు ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన థియేటర్స్, అలానే టాక్ ని బట్టి మొత్తంగా రూ.5 కోట్ల నుండి రూ.8 కోట్లు వస్తే గొప్పని, కానీ ఏకంగా రూ. 20 కోట్లు వచ్చినట్లు అల టీమ్ ప్రకటించడం చూస్తుంటే ఇది మామూలు ఫేక్ కాదు ఊర ఫేక్ అంటూ కొందరు ప్రేక్షకులు పకపకా నవ్వుకుంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: