మహేష్ బాబు మొత్తానికి ఇటీవల రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు తో హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్నారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్, గత ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో మరొక అద్బుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ తో ముచ్చటగా మూడవ విజయం దక్కించుకుని హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్
తన ఓవరాల్ సినిమా కెరీర్ లో ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నానని,

 

ఇటీవల పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పడం జరిగింది. తన కెరీర్లో తొలిసారిగా ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించిన మహేష్ బాబు, ఆ పాత్ర కోసం కొంత బరువు తగ్గానని, అలానే పాత్రలో యాక్షన్, ఎమోషన్, కామెడీ వంటి అంశాలు తనకు ఎంతో బాగా నచ్చాయని అన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించగా, ఒకప్పటి హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. 

 

ఇకపోతే తన ప్రతి సినిమా సక్సెస్ తరువాత విదేశాలకు వెళ్లే అలవాటున్న సూపర్ స్టార్, రెండు రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి అమెరికాకు టూర్ వెళ్లడం జరిగింది. ఇక అక్కడి న్యూయార్క్ నగరం నుండి కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు మహేష్ బాబు. దాదాపుగా రెండు నెలల పాటు ఫ్యామిలీ తో కలిసి అక్కడే ఎంజాయ్ చేయనున్న మహేష్, అనంతరం తిరిగివచ్చాక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. కాగా మహేష్ పోస్ట్ చేసిన ఆ క్యూట్ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: