టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక దానితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి సంక్రాంతికి వచ్చిన ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు మంచి శుభారంభాన్ని అందించింది అనే చెప్పాలి. ఇకపోతే వీటితో పాటు వచ్చిన కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా పర్వాలేదనిపించేలా ముందుకు సాగుతుండగా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన దర్బార్ కూడా బాగానే కలెక్షన్స్ ని రాబట్టింది. 

 

అయితే ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాల్లో అసలైన సంక్రాంతి మొగుడు ఎవరు అనే దానిపై కొద్దిరోజలుగా పలు టాలీవుడ్ వర్గాలతో పాటు, ప్రేక్షకుల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఎవరు సిసలైన విజేత అనే విషయం గురించి మాట్లాడితే, అందరికంటే కూడా ఈ సినిమాలను కొనుగోలు చేసిన టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిజమైన సంక్రాంతి మొగుడని అంటున్నారు. సరిలేరు, అల సినిమాల నైజాం, వైజాగ్ హక్కులను, అలానే దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాల నైజాం హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన దిల్ రాజు, 

 

సరిలేరు సినిమాతో ఈ రెండు ఏరియాల్లో ఏకంగా రూ. 20 కోట్ల వరకు లాభాలు పొందే అవకాశం ఉందని, అలానే అల సినిమాతో కూడా రెండు ఏరియాల్లో రూ.15 కోట్ల వరకు ఆయనకు లాభం వస్తోందని, అయితే దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు మాత్రం ఆయనకు కొంత నష్టాన్ని మిగిల్చాయని అంటున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే దిల్ రాజుకు ఈ సంక్రాంతి సందర్భంగా కొనుగోలు చేసిన సినిమాల నైజాం, వైజాగ్ ఏరియాల నుండి ఏకంగా రూ. 35 కోట్ల వరకు లాభం వచ్చినట్లే అని అంటున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే రాజుగారే నిజమైన సంక్రాంతి మొగుడు అని చెప్పక తప్పదు కదూ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: