మన్మధుడు నాగార్జున సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ అనుష్క శెట్టి, ఫస్ట్ సినిమాతో పెద్దగా సక్సెస్ అందుకోకపోయినప్పటికీ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి పేరు దక్కించుకుంది అనే చెప్పాలి. ఆ తరువాత నుండి మెల్లగా దొరికిన ఛాన్స్ లను అందిపుచ్చుకుని ముందుకు సాగిన అనుష్కకు సరిగ్గా కొద్దిరోజుల తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు తెరకెక్కించిన అరుంధతి సినిమాలో ఛాన్స్ లభించింది. పవర్ఫుల్ కథ, కథనాలు ఉన్నపటికీ కూడా పక్కా లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో మొదట్లో ఒకింత ఆలోచనలో పడ్డ అనుష్క

 

ఆ తరువాత కోడి రామకృష్ణ గారి ప్రోద్బలంతో ఎట్టకేలకు సినిమా చేయడానికి ఒప్పుకుందట. అయితే అనూహ్యంగా రిలీజ్ తరువాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి అనుష్కకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి అనుష్కకు టాలీవుడ్, కోలీవుడ్ లో మరిన్ని అవకాశాలు లభించాయి. ఇక ఇటీవల టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరక్కించిన అత్యద్భుత చిత్రరాజం బాహుబలి రెండు భాగాల్లో కూడా మెయిన్ హీరోయిన్ గా నటించిన అనుష్క ఆ తరువాత నుండి ఇప్పటివరకు కేవలం భాగమతి సినిమాలో మాత్రమే నటించింది. ఇక ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో నటిస్తోంది స్వీటీ. ఈనెల 31న రిలీజ్ కావలసిన ఈ సినిమా, ప్రస్తుతం వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. 

 

అయితే బాహుబలి వంటి గొప్ప సినిమాలో నటించి కూడా దాదాపుగా రెండున్నరేళ్ల నుండి కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించిన అనుష్కకు సరిగ్గా సినిమా అవకాశాలు రాకపోవడం పై ఆమె ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే ఒకింత బొద్దుగా తయారవుతున్న అనుష్కకు ఆ బొద్దుతనం కొంత అవకాశాలకు అడ్డంకిగా మారిందనే వార్తలు కూడా పుకారవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం తన చేతిలో ఎన్నో సినిమాలు ఉండవలసిన అనుష్క ఈ విధంగా ఒక్క సినిమాతో సరిపెట్టుకుంటున్న ఆమె దారుణ పరిస్థితిపై ఆమె ఫ్యాన్స్ తో పాటు కొందరు ప్రేక్షకులు కూడా అయ్యో అంటూ ఆమెపై జాలి చూపిస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: