పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాల పరంగా ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. రాజకీయాలకి వెళ్ళ కుండా కుదురుగా సిన్మాలు చేసుకుంటూ ఉంటే ఆ రేంజ్ ఎలా ఉండేదో ఎవరూ ఊహించలేరు. అంతగా ఫ్యాన్ ఫాలోయినంగ్ ఉంది అవన్ కి. వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాపయినా కూడా ఒక్క బ్లాక్ బస్టర్ పడితే నాలుగు ఫ్లాప్ సినిమాలు బ్యాలెన్స్ అయిపోతాయి. అది పవన్ కి ఉన్న క్రేజ్. అంతేకాదు మార్కెట్ పరంగా కూడా పవన్ మచి డిమాండ్ ఉంది. అయితే రాయకీయాలాంటు ఫ్యాన్స్ గుండెల్లో గుదిబండ దింపి సినిమాలకి గుడ్ బాయ్ చెప్పాడు. అయితే అక్కడ పవన్ కి ఒరిగిందేమీ లేదు. ఆయన ఒరగబెట్టిందేమీ లేదు. ఇక రేపు మాపు అంటూ నెట్టుకొస్తూ రెండేళ్ళ గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేసాడు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు పింక్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు. మొదటి రోజు మధ్యాహ్నం వరకూ పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీసారు. 

 

అయితే నిన్న సడెన్ గా షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ ఫోటో బయటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక సినిమాలకు స్వస్తి పలుకుతాడేమో అనుకున్న సమయంలో ఫ్యాన్స్ కి సైలెంట్ గా గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే ఇదే స్పీడ్ తో మరో సినిమా స్టార్ట్ చేసి మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట పవన్ కళ్యాణ్. ఈ నెలలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం డైరెక్షన్ లో సినిమా చేస్తున్న పవన్ నెక్స్ట్ క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేయబోన్నాడు. ఏ.ఎం.రత్నం నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా 27 నుండి సెట్స్ పైకి రానుందని తాజా సమాచారం.

 

ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ ఇలా ఉన్నపళంగా ఈ రెండు సినిమాలు చేయడానికి అసలు రీజన్ ఇద్దరు నిర్మాతలు. వాళ్ళలో ఒకరు ఏ.ఎం.రత్నం. ఆయన దగ్గర నుండి ఎప్పుడో ఓ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నాడు పవన్. ఆ బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసాడు. ఇక తన బ్యానర్ లో ఒక సినిమా చేయమని ఎప్పటి నుండో పట్టుబడుతున్నాడు దిల్ రాజు. అడ్వాన్స్ ఏమి తీసుకోనపటికి ఎప్పటికైనా నీతో ఒక సినిమా చేస్తా అని అప్పట్లో రాజు కి మాటిచ్చాడు పవన్. అందుకే రాజు బ్యానర్ లో పింక్ రీమేక్ ఏఎం.రత్నం బ్యానర్ లో క్రిష్ సినిమా చేసి వారిద్దరి బాకీ తీర్చబోతున్నాడు. మాట నిలబడటం బాగానే ఉంది కాని ఇలా సగం సగం స్ట్రాటజీనే జనాలకి అర్థం కావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: