పవన్ కళ్యాణ్ తన రాజకీయాలను కొనసాగిస్తూ మళ్లీ సినిమాల్లోకి రావడమే  కాకుండా ఇప్పటికే తన ‘పింక్’ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరిలో మరో భారీ షెడ్యూల్ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. 

దీనితో పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడ అతి త్వరలో ప్రారంభం కావడానికి రంగం సిద్ధం అయింది. ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మైత్రి మూవీస్ సంస్థ దూతగా వచ్చి పవన్ కు ఒక కథ చెప్పి ఓకె చేయించుకున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. 

వాస్తవానికి పూరీ ఇప్పటికే విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో పూరీ పవన్ కు కథ చెప్పడం ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. మరికొందరైతే పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలలో సమాంతరంగా నటిస్తూ మరొక కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై పవన్ కళ్యాణ్ విమర్శకులు మాత్రం మరొక విధంగా స్పందిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజథానుల నిర్ణయం పై పోరాటం చేస్తున్న పవన్ మూడు సినిమాలలో నటిస్తూ ఒక కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తాడా అంటూ జోక్ చేస్తున్నారు. వాస్తవానికి క్రిష్ కథకు పవన్ ఇప్పటికే ఓకె చెప్పిన పరిస్థితులలో ఇప్పుడు పూరి రాయబారాలు ఏమిటి అన్న విషయం చాల మందిని కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధి నాయకత్వాన్ని కలవబోతున్న పరిస్థితులలో అక్కడ ఆ పార్టీ పెద్దలు పవన్ కు ఇచ్చే సూచనలను బట్టి మళ్ళీ పవన్ సినిమా ప్లాన్స్ మారిపోయినా ఆశ్చర్యం లేదు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: