సంక్రాంతి రేసుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల మధ్య ఫైట్ లో బన్నీ మహేష్ ల మధ్య ఇగోలు బయటపడినా ఈ రెండు సినిమాలలోను కీలక పాత్రలో నటించిన విజయశాంతి టబు లకు నిరాశనే మిగిల్చాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. 13 సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పై చాల ఆశలు పెట్టుకుంది.

సినిమా ఊహించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో విజయశాంతికి ఏమాత్రం మ్యానియా ఏర్పడలేదు. దీనికితోడు ఆమె ఈ సినిమాలో నటించినందుకు భారీ పారితోషికం తీసుకున్న పరిస్థితులలో ఆమెను ఆ స్థాయిలో భరిస్తూ అవకాశాలు ఇవ్వడానికి ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఎవ్వరు రెడీగా లేరు.

ఇక ‘అల వైకుంఠపురములో’ మూవీ సూపర్ సక్సస్ అయినా అందరు ఆ మూవీలో నటించిన బన్నీ గురించి మురళీ శర్మ గురించి దర్శకుడు త్రివిక్రమ్ గురించి మాట్లాడుకుంటున్నారు కాని ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన టబు  గురించి ఎవరు ఒక్క మాట కూడ మాట్లాడటం లేదు. వాస్తవానికి ఈ సినిమాలో నటింప చేసే విధంగా టబు ను ఒప్పించడానికి త్రివిక్రమ్ చాల కష్టపడవలసి వచ్చింది అని అంటారు. ఆమెకు భారీ పారితోషికం ఇవ్వడమే కాకుండా ఆమెకు హీరోయిన్ తో సమానంగా సౌకర్యాలు సమకూరుస్తు టబు కు మంచి గౌరవాన్ని ఇచ్చాడు త్రివిక్రమ్. 

అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం 15 నిముషాలు మించి కనిపించకపోవడంతో పాటు కనీసం ఆమెకు ఒక మంచి డైలాగ్ కూడ త్రివిక్రమ్ ఇవ్వలేకపోయాడు. దీనితో టబు ‘అల వైకుంఠపురములో’ పనికిరాని పాత్రగా మారిందా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ టబు దృష్టి వరకు రావడంతో ఆమె ఈ విషయమై త్రివిక్రమ్ తో మాట్లాడితే ఆమె పాత్ర నిడివి సమస్య వల్ల ఎడిటింగ్ లో కట్ అయింది అని చెప్పాడట. దీనితో తమ రీ ఎంట్రీ తో టాలీవుడ్ ను షేక్ చేస్తారు అనుకున్న విజయశాంతి టబులు దీపావళి టపాసులు లా పెలిపోయారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: