టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీల హడావుడి కొంత కాలంగా బాగా పెరిగిపోయింది. కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయంతో తెలుగుకు తెరకు తొలి పరిచయం అయ్యింది  శ్వేత బసు ప్రసాద్. బాలీవుడ్ లో బాలనటిగా మంచి నటిగా పెరు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈమె కేరీర్లో ప్రతిది ఊహించని మలుపే అని చెప్పాలి. ఇక  శ్వేతపై వ్యభిచారం ఆరోపనలు.. అరెస్ట్ అనంతర పరిణామాలు తన లైఫ్ ను డైలామాలో పడేసింది. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆమె ఖండించినప్పటికి అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది.  కొంత కాలం అన్నీ మర్చిపోయి.. బుల్లితెరపై నటించింది. అనురాగ్ బసు లాంటి గురువుతో కలిసి పలు చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసింది.  

 

శ్వేతాబసు ప్రసాద్‌ 2018లో డైరెక్టర్‌ రోహిత్‌మిట్టల్‌ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తమ వివాహబంధానికి ముగింపు పలకాలని తాను, రోహిత్ పరస్పరం అంగీకారానికి వచ్చామని శ్వేత తెలిపింది. లోతుగా చర్చించిన తర్వాత తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఇరువురి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ప్రతి పుస్తకాన్ని మనం పూర్తిగా చదవలేక పోవచ్చని... దీని అర్థం ఆ పుస్తకం బాగోలేదని కాదని చెప్పింది.

 

తాజాగా ఈ విషయంపై శ్వేతాబసు ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చింది. అవును. మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు పెట్టుకున్నాం. మేమిద్దరం భార్యాభర్తల కంటే ముందు మంచి స్నేహితులమని చెప్పింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వివరాలు మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నవి. నటజీవితంలో రోహిత్‌ మిట్టల్‌ ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. చాలా నెలల సుదీర్ఘ ఆలోచన తర్వాత మా వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. మేం మళ్లీ స్నేహితులుగా ఉండాలనుకుంటున్నాం. అంతే.. అని పోస్ట్‌ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: