రాశీ ఖన్నాకి 2019 చివరి నెల బాగా కలిసొచ్చింది. డిసెంబరు నెలలో విడుదల అయిన రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. అందులో ప్రతిరోజూ పండగే చిత్రం బ్లాక్ బస్టర్ అవగా మరో చిత్రం వెంకీ మామా యావరేజ్ గా నిలిచింది. అంతకుముందు ఎన్నో ఫ్లాపులతో సతమతమవుతున్న ఆమెకి ఈ రెండు చిత్రాలు మంచి బూస్ట్ ఇచ్చాయి. దాంతో రాశీ ఖన్నా కి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయని టాక్.

 

 

ప్రస్తుతం ఆమెకి తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ అవకాశాలు వస్తున్నయి. తమిళ పరిశ్రమలో హర్రర్ సినిమాలకు ఆదరణ ఎక్కువ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే హిట్టైన హర్రర్ చిత్రాలకు సీక్వెల్స్ తీస్తుంటారు ఆయా చిత్రాల దర్శకులు. తెలుగులోనూ ఇదే ఫార్ములాని రాజు గారి గది సినిమా ద్వారా ఓంకార్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం తమిళ దర్శకుడు సుందర్ సి ఇదే పనిలో ఉన్నారు. 

 

 

తన పాపులర్ ‘అరన్మనై’ ప్రాంఛైజీలో మూడవ భాగాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. మొదటి భాగంలో హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మీలను, రెండవ భాగంలో హన్సిక, త్రిష, పూనమ్ భజ్వాలను తీసుకున్న ఆయన మూడవ పార్ట్ కోసం రాశీఖన్నా, ఆండ్రియాలను తీసుకోనున్నారు. ఇలా పాపులర్ హర్రర్ ప్రాంఛైజీలో భాగమవడం పట్ల రాశీఖన్నా చాలా హ్యాపీగా ఫీలవుతోంది.

 


 
హర్రర్ జానర్లో సినిమా చేయడం తనకు చాలా ఇష్టమని, అలాంటి అవకాశం తనకి ఇప్పటి వరకి రాలేదని, దానికోసం ఎంతగానో ఎదురు చూశానని ఆ కోరిక ‘అరన్మనై 3’తో నెరవేరుతుండటం సంతోషంగా ఉందని అంటోంది. ఇకపోతే ఇందులో ఆర్య ప్రధాన పాత్రదారుడిగా నటించనున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ హార్రర్ సినిమాతో తన సక్సెస్ ని కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: