మెగా ఫ్యామిలీ నుంచి ముకుంద మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్.  మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ బాలనటుడిగా ఓ సినిమాలో నటించాడు.  ముకుంద మూవీ పెద్దగా సక్సెస్ కాకున్నా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు వరుణ్ తేజ్.  ఈ మూవీ జాతీయ అవార్డు అందుకోవడం మరో విశేషం. ఈ మూవీలో వరుణ్ తేజ్ నటనకు అందరూ పిదా అయ్యారు.  తర్వాత ఒకటీ రెండు సినిమాలు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు.  ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ‘ఫిదా’ మూవీతో మరో ఘన విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నాడు. 

 

గత ఏడాది సంక్రాంతి కి వచ్చిన ‘ఎఫ్ 2’ మూవీ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ మూవీతో మరో విజయం అందుకున్నాడు. ఇప్పుడు, అతను GA2 పిక్చర్స్ లో కొత్త దర్శకుడితో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. అంతే కాకుండా  ప్రతి నాయకుడి పాత్రకు సూపర్ టాలెంటెడ్ విజయ్ సేతుపతిని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం.  అయితే ఇక్కడే మరో సమస్య వచ్చిందని అంటున్నారు. తాను తమిళ నటుడు విజయ్ సేతుపతితో చేయలేని వరుణ్ తనపై ఆసక్తి చూపడం లేదని వర్గాలు చెబుతున్నాయి.

 

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. విజయ్ అద్భుతమైన నటుడు, అతని నటనతో సరిపోలడం కష్టం...తనకు విలన్ గా మరెవరైనా తీసుకుంటే బాగుంటుందన్న తన మేకర్లను చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు, విజయ్ సేతుపతిని ఆన్‌బోర్డ్‌లోకి తీసుకురావాలని దర్శకుడు, నిర్మాతలు పట్టుబడుతున్నారు.  దాంతో వరుణ్ తేజ్ కి విలన్ ఎవరు అన్న విషయంపై ఇక చిత్ర యూనిట్ అఫిషియల్ స్టేట్ మెంట్ ఇస్తే కానీ తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: