ఈమధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు 78వ పుట్టినరోజు వేడుకలు చాల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తులు మాత్రమే కాకుండా రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు వచ్చి కృష్ణంరాజును అభినందించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడ హాజరు అయ్యాడు. 

చిరంజీవిని చూడగానే ముందుకు వెళ్ళి ప్రభాస్ అభిమానంతో పలకరిమ్చడమే కాకుండా చిరంజీవికి తానే స్వయంగా డిన్నర్ ప్లేట్ అందించి ప్రభాస్ అన్నీ తానై చూసుకున్నాడు అని ఆ పార్టీకి వెళ్ళినవారు దగ్గర నుండి వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ చేసిన ఈ అతిథి మర్యాదలకు పొంగిపోయిన చిరంజీవి ప్రభాస్ చేతిని తన చేతిలో తీసుకుని కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి దగ్గరకు వెళ్ళి ఈ పార్టీలు సరే ఈ ఏడాది అయినా ప్రభాస్ పెళ్ళి చేస్తారా లేదా అంటూ నవ్వుతూ అడిగినట్లు సమాచారం. 

దీనికి శ్యామలా దేవి సమాధానం ఇస్తూ తనకు ప్రభాస్ పెళ్ళి విషయమై అతడికి అనేక సార్లు చెప్పి విసుగు పుట్టిందని అందువల్ల ఆ బాధ్యతను చిరంజీవిని తీసుకోమని నవ్వుతు అభ్యర్ధించినట్లు సమాచారం. దీనితో మరింత జోష్ లోకి వెళ్ళిపోయిన చిరంజీవి తాను ఈ సంవత్సరం అంతా ఇదే పని మీద ఉంటాను అని అనడంతో ఆ పార్టీకి వచ్చిన అతిధులు అంతా తెగ నవ్వుకున్నట్లు సమాచారం. 

దీనితో కనీసం మెగా స్టార్ చిరంజీవి ఒత్తిడితో అయినా ప్రభాస్ ఈ సంవత్సరం ముగిసేలోగ ఒక ఇంటి వాడు అవుతాడో లేదో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి ఆ పార్టీలో కృష్ణంరాజు భార్య శ్యామలా దేవితో జోక్ చేసిన ఫోటోలు మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు కనీసం చిరంజీవి ఒత్తిడి అయినా ప్రభాస్ మనసును మార్చాలని కోరుకుంటున్నారు. అయితే తండ్రితో సమానంగా చూసుకునే కృష్ణంరాజు మాటనే లైట్ గా తీసుకున్న ప్రభాస్ చిరంజీవి మాటలను ఎంతవరకు వింటాడు అన్నది ప్రశ్న.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: