బాలీవుడ్ లో గత కొంత కాలంగా స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు.  ఈ నేపథ్యంలో జగ్గూబాయ్ జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.  యాక్షన్ తరహా సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న టైగర్ ష్రాఫ్  మంచి మార్షాల్ ఆర్టిస్ట్.  తనదైన సాహస విన్యాసాలతో థియేటర్లో కూర్చున్న అభిమానులను ఔరా అనేలా చేస్తున్నారు.  కొన్ని ప్రైవేట్ షోస్ లో కూడా టైగర్ ష్రాఫ్  తన కరెటా, జిమ్నాస్టిక్ విన్యాసాలతో అబ్బుర పరుస్తున్నాడు. టైగర్ ష్రాఫ్  నటించిన భాగీ 1 మూవీ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 

 

టైగర్ ష్రాఫ్ భాగీ సీరీస్ లో ఇప్పటి వరకు  రెండు  సినిమాలు చేశాడు.  రెండింటిలో సెకండ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సీరీస్ లో మూడో పార్ట్ ను తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.  భాగీ 3 సినిమాను మార్చి 6, 2020 లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాజిద్ నదియావాలా నిర్మాత.  కాగా, ‘భాగీ3’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇందులో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించాడు. హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్‌ నటించింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్ర పోషించాడు.

 

ఇందులో రితేష్, టైగర్‌ ష్రాఫ్‌ బ్రదర్స్‌గా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ లో కలిసి నటిస్తున్నారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. ‘భాగీ’ సీక్వెల్ లో వస్తున్న 3 భాగంపై అంచనాలు అప్పుడే భారీగా పెరిగిపోతున్నాయి. మరీ ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ , శ్రద్దా కపూర్ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: