టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు తొలిరోజు ఒకింత మిశ్రమ స్పందన సంపాదించినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ చరిష్మా తో పాటు సంక్రాంతి పండుగా సీజన్ కావడంతో మంచి కలెక్షన్ రాబడుతూ ముందుకు సాగుతోంది. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కి యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మించారు. 

 

ఇక ఇటీవల వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా, మొత్తం పది రోజులకు గాను రూ.124 కోట్ల షేర్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నిన్నటితో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.102.97 కోట్ల షేర్ లభించిందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మొన్నటి కీలక మండే టెస్ట్ లో పాసై మంచి కలెక్షన్ సాధించిన ఈ సినిమా కేవలం మొదటి వారంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.84 కోట్ల షేర్ ని అందుకుని, నిన్నటితో సక్సెస్ఫుల్ గా రూ.102.97 కోట్ల షేర్ అందుకోవడం జరిగింది. కాగా ఇప్పటి వరకూ బాహుబలి 2(198.7 కోట్లు), బాహుబలి(110.1 కోట్లు), సైరా నరసింహారెడ్డి(104.9 కోట్లు) సినిమాలు మాత్రమే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి. ఇప్పుడు 100కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన 4వ సినిమాగా సరిలేరు నీకెవ్వరు రికార్డ్ నెలకొల్పింది. మరో రెండు రోజుల్లో సైరా నరసింహారెడ్డి రికార్డ్ ని క్రాస్ చేసి ఈ సినిమా అల్ టైం టాప్ 3 లో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

 

‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 11 డేస్ కలెక్షన్స్:  

 

నైజాం – 33.54 కోట్లు 

సీడెడ్ – 14.4 కోట్లు 

గుంటూరు – 9.1 కోట్లు 

ఉత్తరాంధ్ర – 17.15 కోట్లు 

తూర్పు గోదావరి – 10.25 కోట్లు 

పశ్చిమ గోదావరి – 6.71 కోట్లు 

కృష్ణా – 8.09 కోట్లు 

నెల్లూరు – 3.73 కోట్లు  

11 రోజుల మొత్తం షేర్ – 102.97 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: