యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత మూడేళ్ళలో కేవలం మూడు సినిమాలు మాత్రమే తీశాడు. ఈ మూడు సినిమాల్లో ఒక సినిమా 'సాహో' అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. సాహో మూవీ చిత్రీకరణ ముగిసిన అనంతరం విదేశాలకు వెళ్లి తన హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేశాడు ప్రభాస్. అయితే తాజాగా ఇండియాకి తిరిగి వచ్చేసిన ప్రభాస్... 2018వ సంవత్సరంలో అర్ధాంతరంగా ఆగిపోయిన 'జాన్' లేదా #Prabhas20 చిత్ర షూటింగ్ ను పునఃప్రారంభిస్తున్నానని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియపరిచాడు. దీంతో చాలా మంది ప్రభాస్ అభిమానులు సంబరపడిపోయారు. అయితే ప్రస్తుతం #Prabhas20 చిత్రం నుండి మరొక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చి ప్రభాస్ అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది. 

 

 

ఇంతకీ ఆ ఇంటరెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ప్రభాస్ తదుపరి చిత్రంలో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ భాగ్యశ్రీ నటించబోతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాన్ చిత్ర షూటింగ్ నిమిత్తం భాగ్యశ్రీ హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం. జాన్ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ అవుతుండటంతో బాలీవుడ్ నటులు ఈ చిత్రానికి ఎంతైనా అవసరమని ప్రభాస్ తో సహా దర్శకుడు రాధాకృష్ణ కూడా భావిస్తున్నారని స్పష్టమవుతుంది. పాన్ ఇండియా చిత్రమైన సాహో ఫ్లాప్ అయిన విషయం పక్కన పెడితే, ఈ మూవీలో కూడా అనేకమంది బాలీవుడ్ యాక్టర్లు నటించారు. 

 

 

ఇకపోతే, రొమాంటిక్ అండ్ యాక్షన్ కథతో తెరకెక్కుతున్న జాన్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. నిజానికి హీరో ప్రభాస్ కి బాలీవుడ్ లో బాగా క్రేజ్ ఉండటంతో.. ఈ సినిమా హిట్టవుతుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ఈ చిత్రం హిట్టయితే భాగ్యశ్రీ కి బాలీవుడ్ లో పెద్ద అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఈ చిత్రం ఆమెకు వెరీ వెరీ స్పెషల్ అని తన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలానే జాన్ సినిమా కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ సారధ్యంలో నిర్మించ బడుతున్న ఈ చిత్రం 2021 వేసవి కాలంలో విడుదల అవుతుందని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: