సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వెళ్లినా.. మనసంతా సిల్వర్ స్క్రీన్ పైనే. రాజకీయాల్లో వెళ్లిన వారు.. త్వరలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నవారు యాక్టింగ్ ను విడిచిపెట్టలేక వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీతో తమకున్న బంధాన్ని రజినీకాంత్.. కమల్ హాసన్.. పవన్ కళ్యాణ్ వదల్లేకపోతున్నారు.

 

రెండేళ్ల కెమెరాకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో రీఎంట్రీ ఇచ్చాడు. సోమవారం ఉదయం షూటింగ్ లో పాల్గొన్న పవర్ స్టార్ సాయంత్రం జనసేన కార్యాలయంలో కనిపించాడు. యాక్టింగ్.. యాక్టింగే.. పాలిటిక్స్.. పాలిటిక్సే అన్న ఫార్ములాతో పింక్ తో పాటు మరో మూవీని లైన్ లో పట్టేశాడు పవన్. 

 

పింక్ సినిమా కోసం 20రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే సరిపోతుంది. దీని తర్వాత క్రిష్ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కే ఈ సినిమా 27న లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలిసింది. ఆల్ రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. త్వరలో సెట్స్ వేయడం మొదలు పెడతారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు కీరవాణి మ్యూజిక్ అందిస్తారని తెలిసింది. 

 

త్వరలో పార్టీ పెట్టి తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తానన్న రజినీకాంత్ ఈలోగా.. నాన్ స్టాఫ్ గా సినిమాలు చేసేస్తున్నాడు. దర్బార్ రిలీజ్ కాకుండానే.. శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎప్పుడూ లేనిది ఏడాదికి రెండు సినిమాలతో వస్తున్నాడు సూపర్ స్టార్. 

 

కమల్ హాసన్ అయితే ఆల్ రెడీ పార్టీ పేరును కూడా ఎనౌన్స్ చేసేశాడు. ఎప్పటి నుంచో అనుకున్న భారతీయుడు 2ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు కమల్. ఇలా పాలిటిక్స్ లో ఉన్న హీరోలు.. యాక్టింగ్ కు కూడా మెయిన్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇలా నటించడం కారణంగా.. వచ్చే భారీ రెమ్యునరేషన్ పార్టీ అవసరాలకు ఉపయోగపడతాయన్న ఉద్దేశం కావొచ్చు. లేదంటే.. యాక్టింగ్ పై ఉన్న ఫ్యాషన్ కావొచ్చు. చివరికి ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: