టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలుత ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా అడుగుపెట్టడం జరిగింది. మొదట ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన చిరంజీవి, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా తన టాలెంట్ తో అవకాశాలు అందిపుచ్చుకుని సుప్రీం హీరోగా, ఆపై మెగాస్టార్ గా ఎదిగారు. దాదాపుగా ఒక దశాబ్దం పైగా మెగాస్టార్ హవా ఏ రేంజ్ లో కొనసాగిందో మన తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయనతో పాటు సినిమాల్లోకి వచ్చిన మెగాబ్రదర్ నాగబాబు మధ్యలో అక్కడక్కడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్ట్ గా నటించి, 

 

ఆపై అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించారు. అనంతరం హీరోగా వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించి పవర్ స్టార్ గా టాలీవుడ్ లో అగ్రపథాన నిలిచారు. అనంతరం వారి ఫ్యామిలీ నుండి వచ్చిన  అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ వంటి వారందరూ కూడా తమవంతుగా మంచి సినిమాల్లో నటిస్తూ మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం వారి ఫ్యామిలీ నుండి సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. 

 

ఇకపోతే కాసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ లోగోని ఈ సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు అఫీషియల్ గా రిలీజ్ చేసారు. పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించబడిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు సాయంత్రం రిలీజ్ చేయనున్న సినిమా యూనిట్, అదే సమయంలో సినిమా గురించిన పూర్తి వివరాలు తెలియచేయనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి తొలి సినిమాతో ఈ మెగా మేనల్లుడు ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి....!!    

మరింత సమాచారం తెలుసుకోండి: