సంక్రాంతి సూపర్ హిట్ బొమ్మ అనిపించుకున్న సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. జనవరి 11న రిలీజైన ఈ సినిమా 11 రోజుల్లో ఏపి-తెలంగాణాల్లోనే 102 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే ఈ సినిమాకు సంబందించిన దర్శక నిర్మాతలు అనీల్ రావిపుడి, దిల్ రాజు, అనీల్ సుంకరలు స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి సినిమాలో మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నామని అన్నారు.

 

సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని బీభత్సమైన వసూళ్లు రాబడుతుందని. మహేష్ లాంటి స్టార్ హీరోతో 5 నెలల్లో ఈ సినిమా పూర్తి చేయడం గొప్ప విషయమని.. అనీల్ రావిపుడిసినిమా కోసం చాలా కష్టపడ్డాడని.. అది సినిమా తెర మీద కనిపిస్తుందని నిర్మాత అనీల్ సుంకర అన్నారు. ఇక దిల్ రాజు కూడా ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికి మంచి లాభాలు తెచ్చిందని అన్నారు. మహేష్ బాబు కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచిందని అంటున్నారు.

 

ఇక ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా సినిమాలో మరో నిమిషన్నర సీన్ యాడ్ చేస్తున్నామని.. మహేష్, రావు రమేష్ ల మధ్య ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే ఈ సీన్ చాలా బాగుంటుందని అన్నారు దర్శకుడు అనీల్ రావిపుడి. ఇక సినిమా చూసిన ఆడియెన్స్ అంతా ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఇస్తున్నారని.. సినిమాలో తన డైలాగ్స్ చాలా మీంస్ రూపంలో వస్తున్నాయని, ముఖ్యంగా రమణా లోడ్ ఎత్తాలిరా అన్న డైలాగ్ మీద చాలా మీంస్ వస్తున్నాయని అన్నారు అనీల్ రావిపుడి. మొత్తానికి సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయినందుకు చిత్రయూనిట్ మొత్తం సంతోషంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: