బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ట్రిపుల్ ఆర్ సెట్ లోకి అడుగుపెట్టాడు. రాజమౌళి సినిమాలో అజయ్ నటిస్తున్నాడని చాలా కాలం క్రితమే ఎనౌన్స్ చేసినా.. షూటింగ్ కు టైమ్ ఇప్పుడొచ్చింది. అజయ్ దేవగణ్ కు స్వాగతం పలుకుతున్న స్టిల్ ను రాజమౌళి రిలీజ్ చేశాడు. 

 

అజయ్ దేవగణ్ నిర్మించిన తాన్హాజీ ఆ మధ్య విడుదలై.. 175కోట్లు కలెక్ట్ చేసింది. 200కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాన్హాజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ట్రిపుల్ ఆర్ షూటింగ్ లోకి అడుగుపెట్టాడు అజయ్. 

 

ట్రిపుల్ ఆర్ కొత్త షెడ్యూల్ మంగళవారం ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లోనే అలియాభట్ కూడా జాయిన్ అవుతుందని తెలిసింది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్  కు జోడీగా ఆలియా నటిస్తోంది. కొమరం భీం రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ప్రియురాలిగా ఫారిన్ నటి కనిపంచనుంది. 

 

ట్రిపుల్ ఆర్ లో అల్లూరి, కొమురం భీం గురువు పాత్ర చాలా కీలకమైంది. ఈ రోల్ ను అజయ్ దేవగణ్ తో చేయిస్తున్నాడు రాజమౌళి. హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 400కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. బాహుబలిని పాన్ ఇండియా మూవీగా తీద్దామని అనుకోలేదు. దీంతో ఇక్కడి నటీనటులతో బాహుబలి సిరీస్ ను తీసిన రాజమౌళి.. హిందీలో భారీ బిజినెస్ కోసం బాలీవుడ్ నటులతో ట్రిపుల్ ఆర్ తీస్తున్నాడు. 

 

బాహుబలితో ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించి హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసిన రాజమౌళి త్రిపుల్ ఆర్ తో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. నటీనటుల ఎంపికలో కూడా తన మార్క్ ను చూపిస్తున్నాడు. యాక్టర్స్ సెలక్షన్ లో ఏమాత్రం తగ్గకుండా ఎంతకైనా వెళుతున్నాడు. ఎప్పటికప్పుడు సినీ జనాల్లో క్యూరియాసిటీ పెంచుతూ త్రిపుల్ ఆర్ పై ఉత్కంఠను రేపుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: