టీవీలో రెండున్నర అలరించే సినిమాలకంటే... రోజుల తరబడి కాదు కాదు నెలల తరబడి.. కాదు కాదు సంవత్సరాల తరబడి అలరించే సీరియళ్లకు ఎక్కువ మొత్తంలో ఫాన్స్ ఉంటారు. టీవీలో ప్రసారమయ్యే సీరియల్ కు మహిళా  అభిమానులే  ఎక్కువమంది ఉంటారు అనడంలో సందేహం లేదు. సీరియల్లో ఇన్వాల్వ్ అయిపోయే  మహిళా ప్రేక్షకులు ఎంతో మంది.  ఒక రోజు అన్నం తినడం అయినా మానేస్తారు ఏమో కానీ సీరియల్ చూడటం  మాత్రం అస్సలు మణుకోరు . సీరియల్ వచ్చే టైం కల్లా ఎన్ని పనులు ఉన్నా చకచకా పూర్తి చేసుకుని టీవీ ముందుకొస్తారు మహిళా మణులు. సీరియల్ వచ్చేటప్పుడు మాత్రం తమ వద్ద నుంచి ఎవరైనా రిమోట్ తీసుకుని ఛానల్ మార్చారు అంటే ఇక అంతే రణరంగమే. రోజురోజుకు సీరియల్ కు క్రేజ్ పెరుగుతూ వస్తుంది. 

 

 

 అయితే మరింత మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించి... తమ టీవీ పాపులారిటీని పెంచుకునేందుకు జీతెలుగు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులను తన ససీరియళ్లతో  అలరిస్తున్న మా టీవీ దెబ్బ ఎదుర్కోవడానికి జీ తెలుగు సరికొత్త ఆలోచనని  తెరమీదికి తెచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ను రంగంలోకి దించింది జీ తెలుగు. జీ తెలుగు కొత్త కొత్త సీరియల్ ప్రసారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్రినయని, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం అనే మూడు సీరియల్స్ ప్రసారం చేయండానికి  జీ తెలుగు రెడీ అయ్యింది. ప్రచారం కావడానికి ముందు ఆ సీరియల్స్  ప్రమోషన్స్ కూడా బాగా ఇంపార్టెంట్ కదా.. ప్రమోషన్స్ ఎలా చేయాలని ఆలోచించి  దీని కోసం ఏకంగా మహేష్ బాబు ను రంగంలోకి దింపింది జీ తెలుగు. 

 


 మీకు నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు కానీ మీ అభిమానం నన్ను  సూపర్ స్టార్ ని చేసింది. సినిమా నన్ను పరిచయం చేస్తే.. టీవీ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ ని చేసింది అంటూ మహేష్ బాబు ప్రమోషన్ చేస్తున్న వీడియో ని ప్రస్తుతం జీతెలుగు విడుదల చేసింది. ఈ ప్రోమోలో  మహేష్ కు  యాంకర్ ప్రదీప్ తోడై ... ఒక్క సీరియల్ కి ఒక్కో స్టైల్ లో  ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. సీరియల్ లోని నటుల్ని  ప్రదీప్ మహేష్ బాబు కు పరిచయం చేస్తే... మహేష్ బాబు  సీరియల్ పేరు చెబుతూ చూడండి జీ తెలుగులో అంటూ ప్రమోషన్ చేస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అయిపోయింది. ఇక ఈ ప్రోమోలో  చివరిగా కొత్త బంధాలతో మన జీ తెలుగులో ఇక పండగే అంటూ ముగిస్తారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: