బొమ్మ దద్దరిల్లిపోతుంటే.. సినిమా బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఊహించలేదు. సరిలేరు నీకెవ్వరు 100కోట్ల షేర్ తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మహేశ్ కెరీర్ లో తొలి 200 కోట్ల గ్రాస్ మూవీ ఇదే. ఈ సందర్భంగా స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. 

 

మహేశ్ నమ్మకాన్ని అనిల్ రావిపూడి నిలబెట్టుకున్నాడు. హిట్ ఇస్తాడనుకుంటే.. కొత్త రికార్డులు క్రియేట్ చేసే మూవీ ఇచ్చాడు దర్శకుడు. మహర్షితో 100కోట్ల షేర్ ఫస్ట్ టైం చేయగా.. సరిలేరు నీకెవ్వరుతో 200 కోట్ల గ్రాస్ ను కూడా దాటేశాడు. 

 

సరిలేరు నీకెవ్వరు డివైడ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. దీనికి తోడు సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో.. 10రోజుల పాటు కలెక్షన్స్ మోత మోగించింది. 200కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రిలీజై పదిరోజులు దాటినా.. ఇప్పటికీ పబ్లిసిటీలో పోటీపడుతూనే ఉన్నాయి. ఎవరి రికార్డులు వాళ్లు చెప్పుకుంటూ.. ఆసక్తి  పెంచేస్తున్నారు. కలెక్షన్స్ ఏ ఫిగర్ దగ్గర ఆగుతాయో చూడాలి. 



మహేశ్ బాబు పేరు చెప్పగానే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతారు. డైలాగ్ డెలివరీలో ఆయన మేనరిజమే సెపరేట్. సైలెంట్ గా ఉంటూనే అదిరిపోయే మాటలతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఇదే ఆయనలో ఉండే టాలెంట్. దానికి తోడు మంచి కథ దొరికితే ఇంకేముందీ.. బ్లాక్ బస్టరే. అదే జరిగింది సరిలేరు నీకెవ్వరులో.. గొప్ప కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజై 10రోజులు దాటినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఒక్కసారి సినిమా చూసిన వాళ్లు రెండు సార్లు, రెండు సార్లు చూసిన వాళ్లు మూడుసార్లు.. మూడుసార్లు చూసిన వాళ్లు నాలుగు సార్లు ఇలా థియేటర్ల బాట పట్టి సినిమాను ఎక్కడో ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: