త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురంలో” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ విశాఖపట్నం వేదికగా చాలా ఘనంగా నిర్వహించారు సినిమా యూనిట్.

 

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పని చేయాలని తన చిరకాల డ్రీమ్ కోరికని ఎట్టకేలకు అది 'అరవింద సమేత' సినిమాతో తీరిందని ఆ సినిమాలో సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి ఆ తర్వాత  ‘అల వైకుంఠపురంలో’ సాంగ్స్ మరింతగా నా స్థాయి ని పైకి పెంచడం జరిగిందని ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఇంకా ఆనందంగా ఉందని...జీవితంలో మర్చిపోలేని ఆదరణ 'అల వైకుంఠపురంలో' సినిమా పాటల ద్వారా అందిందని మాట్లాడిన తమన్ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ అల వైకుంఠపురంలో సినిమాకి వచ్చిన కలెక్షన్లు మరియు రికార్డులన్నీ నిజమేనని ఎక్కడా కూడా ఫేక్ కలెక్షన్లు గాని రికార్డులు గాని ప్రకటించలేదని ఈ సినిమాతో గెలిచాం సంక్రాంతికి విజయం సాధించామని తమన్ వ్యాఖ్యానించడంతో కామెంట్లు చేయడంతో తమన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

తమన్ చేసిన వ్యాఖ్యలు సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంబంధించి ఉద్దేశించినవి అని మహేష్ బాబు నటించిన పరిచే విధంగా తమను కామెంటు చేశారని తమన్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ప్రతి పోవటంతో పాటు భవిష్యత్తులో థమన్ కు అవకాశం ఇవ్వకూడదని వారు మహేష్ కు ట్వీట్లు చేశారు. దీనితో ఇప్పుడు థమన్ డామేజ్ కంట్రోల్ కు పూనుకున్నాడు. “నేను అందరి హీరోలతో పని చేస్తా. ఎవరిని కించపరచను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను కేవలం అల వైకుంఠపురంలో సక్సెస్ జెన్యూన్ అని చెప్పా,” అన్నారు. దీంతో తమన్ కొత్త డ్రామా మొదలెట్టాడు అంటూ మహేష్ అభిమానులు ఇంకా ఫైర్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: