'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పింక్ సినిమా తెలుగులో రీమేక్ చేయడంతో ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ జనవరి 20వ తారీఖున జరగటంతో ఆ సందర్భంలో సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న పిక్ సోషల్ మీడియాలో రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పుల్ జోష్ మీద ఉన్నారు. కాగా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఏకంగా 50 కోట్ల రెమ్యునిరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో కేవలం పవన్ కళ్యాణ్ 20 రోజులు మాత్రమే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

 

అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు దాంతో ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్ పవన్ కళ్యాణ్ పై జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే సినిమాకి సంబంధించి షూటింగ్ ఉదయం మొదలైతే సాయంత్రం మాత్రం రాజకీయాల్లో ఉండాలని ఒకవేళ సాయంత్రం షూటింగ్ అయితే ఉదయం మొత్తం పాలిటిక్స్ లో ఉండాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో రాష్ట్రం లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమా రంగంలోనూ రాజకీయరంగంలోనూ పవన్ పై అతిపెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి.

 

కాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ట్లు అప్పటినుండి ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొని వచ్చే వేసవికి ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నట్లు సమాచారం. మరోపక్క ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి వారం రోజులు గడవక ముందే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ జనవరి 27 వ తారీఖున మొదలు కానున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: