ప్రస్తుతం బాలీవుడ్ లో సంవత్సరానికి వరుసగా నాలుగైదు సినిమాలు చేసే కెపాసిటీ, స్పీడ్ లో ఉన్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. గత రెండేళ్ళుగా వరుస హిట్స్ ని అందుకుంటున్న అక్షయ్ .. తను నటించే అన్ని సినిమాలు రూ.100 కోట్లు వరకు వసూళ్ళు రాబడుతుంటాయి. అదీకాకుండా ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. అందుకే సినిమాకు పారితోషికాన్ని కూడా పెంచేశారట అక్షయ్. రీసెంట్‌గా ‘గుడ్‌న్యూస్’ సినిమాతో మంచి సక్సస్ అందుకున్న అక్షయ్ కుమార్ తన తర్వాతి సినిమాను ఆనంద్ ఎల్ రాయ్‌తో కలిసి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ తీసుకునే రెమ్యునరేషన్ రూ.120 కోట్లని బాలీవుడ్ మీడియాలో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

 

ఈ సినిమాలోలో తమిళ స్టార్ హీరో ధనుష్‌ కూడా నటించనున్నారట. సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుందట. అక్షయ్ కుమార్ ఏ విషయంలోనైనా రాజీ పడతారేమో కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వెనక్కి దగ్గరన్న విషయం తెలిసిందే. అంద్కు కారణం ఆయన వరుస సక్సస్ లతో ఉండటమే. అంతేకాదు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. అక్షయ్ నటించే ప్రతీ సినిమాకు మంచి లాభాలు వస్తున్నప్పుడు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం కరెక్టేనని అక్షయ్ సన్నిహితులు అంటున్నారట .

 

ఇక అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని 2020 లోనే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. 2019లో విడుదలైన అక్షయ్ కుమార్ సినిమాలన్నీమంచి హిట్స్ గా నిలిచాయి. రీసెంట్‌గా విడుదలైన ‘గుడ్ న్యూస్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు సాధించింది. ‘కేసరి’ సినిమా రూ.154 కోట్లు, ‘మిషన్ మంగళ్’ సినిమా రూ.202 కోట్లు,‘హౌస్‌ఫుల్ 4’ సినిమా రూ.194 కోట్లు రాబట్టాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 2019 హయ్యస్ట్ పెయిడ్ నటుల్లో అక్షయ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక ప్రస్తుతం అక్షయ్ చేతిలో ‘సూర్యవంశీ’, ‘లక్ష్మీ బాంబ్’, ‘పృథ్వీరాజ్’ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా హిట్ అయితే ఇక ఇపట్లో అక్షయ్ ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఇక ఆనంద్ ఎల్ రాయ్‌ షారుఖ్ తో తెరకెక్కించిన జీరో ఫ్లాయిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: