టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక బాలీవుడ్ హీరో రేంజ్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరో అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇటీవల టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి రెండు భాగాలూ కూడా మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి విజయాన్ని అందుకుని, హీరో ప్రభాస్ తో పాటు సినిమా యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇక ఈ సినిమాల సూపర్ సక్సెస్ తరువాత ప్రభాస్ రేంజ్, ఇమేజ్ అమాంతం పెరిగిపోయాయి. ఇక ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమాని కూడా సినిమా యూనిట్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడంతో పాటు హిందీ సహా పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. 

 

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా జాన్. కొన్నేళ్ల క్రితం గోపీచంద్, రాశి ఖన్నాల కలయికలో వచ్చిన జిల్ అనే యాక్షన్ మూవీని తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ప్రేమకథగా పాన్ ఇండియా అపీల్ తోపాటు అత్యధిక ఖర్చు, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో జరుగుతోంది. 

 

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న నేపథ్యంలో నేటి నుండి ప్రభాస్ కు మరింతగా సెక్యూరిటీని పెంచడం జరిగిందట. ఇప్పటికే ప్రభాస్ కు క్రేజ్ ఎక్కువగా ఉడడంతో పాటు, పలు భద్రతా కారణాల రీత్యా ఆయనకు సెక్యూరిటీ పెంచడం జరిగిందని, అలానే షూటింగ్ అక్కడ జరిగినన్ని రోజులు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి పిక్స్ లీక్ కాకుండా కూడా సినిమా యూనిట్ గట్టిగా చర్యలు తీసుకుంటోందని అంటున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని 2021 వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల కృష్ణంరాజు తెలిపారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: