దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో చిత్రాలకు పోటీగా ఈ
సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం కళ్యా
ణ్
రామ్ నటించిన ఎంత మంచి వాడవురా .. ఈనెల 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద మొదటి రెండు రోజులు ఓకే అనిపించింది. అయితే నెగిటివ్ టాక్ కు తోడు సరిలేరు నీకెవ్వరు , అల వైకుంఠపురములో దాటికి ఆతరువాత చేతులెత్తే సింది. నిన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం 14లక్షల షేర్ ను మాత్రమే రాబట్టిందంటే ఈ
సినిమా పరిస్థితి ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక 7రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 6.60 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3కోట్లు రాబట్టాల్సివుంది. అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం 30లక్షలు కూడా రాబట్టడం కష్టమే సో ఈసినిమా డిజాస్టర్ జాబితాలో చేరనుంది. అయితే నిర్మాతలకు మాత్రం నష్టం ఏమిలేదు. నాన్ థియేట్రికల్ రూపంలో ప్రాఫిట్ జోన్ లోనే వున్నారు. ఎటొచ్చి సినిమాను కొన్న బయ్యర్లే మునుగనున్నారు.