గత ఏడాది సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన ఎఫ్ 2 మంచి టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ కూడా రాబట్టిన విషయం తెలిసిందే..అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో సినిమా రిలీజ్ తరువాత సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

 

హీరో వెంకటేష్‌, నిర్మాత దిల్ రాజులు కూడా ఎఫ్‌ 3 ప్రస్తావన తీసుకువచ్చారు. కథ ఫైనల్‌ అయిన వెంటనే సినిమా సెట్స్ మీదకు వస్తుందని చెప్పారు. అయితే ఈ లోగా అనిల్‌ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో బిజీ కావటంతో ఎఫ్‌ 3 పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్‌ హిట్ కావటంతో ప్రస్తుతం బ్రేక్‌ తీసుకుంటున్న అనిల్‌ త్వరలో కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

 

నిన్న వచ్చిన సరిలేరు నేకెవ్వరూ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు ఎఫ్‌ 3నే అన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరోగా నటించబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు. మాస్‌ మహరాజ్‌ రవితేజ. గతంలో అనిల్‌ దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాలో నటించిన రవితేజ, ఎఫ్‌ 3లో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది..ఇద్దరు హీరోలు అంటే మరి ఏ పాత్రలో కనిపిస్తాడు అన్నది ఆసక్తిగా మారింది..

 

ప్రస్తుతం  మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కోరాజా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమాను ప్రారంభించాడు రవితేజ. ఈ సినిమా పూర్తి కావడానికి మరో మూడు నాలుగు నెలల సమయం పడుతుంది. వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లు కూడా సెట్స్ మీద ఉన్న సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఎఫ్ 3 పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంద నీ సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది మరి ఆ  సినిమా నుండి గురించి తెలియాల్సి వుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: