సంక్రాంతి రేసు ముగిసిపోయి ఈ రేస్ విన్నర్ ఎవరు అన్నవిషయమై స్పష్టమైన క్లారిటీ వచ్చినా ఇంకా ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల మధ్య పోష్టర్ వార్ కొనసాగుతూ ఉండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలు తన సినిమా సూపర్ హిట్ అని తెలిపే విధంగా లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించి 200 కోట్ల కలక్షన్స్ పోస్టర్ ను విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ పోష్టర్ జోక్ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల లోపే ‘అల వైకుంఠపురములో’ యూనిట్ వర్గాలు తమ సినిమా 220 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ మరొక పోష్టర్ వదిలారు. అయితే ఈపోష్టర్ మరింత బిగ్ జోక్ గా మారింది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ‘అల’ సక్సస్ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేకపోయినా ఈమూవీ ఇప్పటి వరకు 140 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను అందుకుందని కేవలం రెండు రోజులలో ఈమూవీ 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అంటూ జరుగుతున్న ప్రచారాన్ని చూసి సూపర్ సక్సస్ అయిన సినిమాకు ఈఫేక్ రికార్డుల గోల ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ ఫేక్ రికార్డుల ప్రచారం ఈ మూవీకి ప్రధాన నిర్మాతలు అయిన హారికా హాసిని సంస్థ ప్రతినిధుల నుండి కాకుండా ఈ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించిన గీత ఆర్ట్స్ ఆఫీషియల్ ట్విటర్ లో ఈకలక్షన్స్ ప్రచారం జరుగుతూ ఉండటం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. వాస్తవానికి బన్నీ ఊహించిన స్థాయికన్నా ‘అల’ కు సూపర్ సక్సస్ రావడమే కాకుండా కలక్షన్స్ రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. 

అయితే అల్లు అర్జున్ పిఆర్ టీమ్ ప్రచారంలోకి తీసుకు వస్తున్న ఫిగర్స్ స్థాయిలో ‘అల’ రియల్ కలక్షన్స్ ఫిగర్స్ లేవు అని అంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమా కలక్షన్స్ చాల బాగున్నప్పటికీ ఈ వారం ఒక్క రవితేజా ‘డిస్కో రాజా’ తప్ప మరేసినిమా ‘అల’ తో పోటీగా లేని నేపధ్యంలో చక్కగా అంది వచ్చిన సక్సస్ ను ఎంజాయ్ చేయలేక ఇలా ఫేక్ రికార్డుల ప్రచారంలో అలను ఇరికించి బన్నీ ఎందుకు తనకు తానుగా విమర్శలకు చోటిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలోని ప్రముఖులు ఆశ్చర్య పోతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: