నిన్న ఢిల్లీ వెళ్ళి అమరావతి రాజధాని విషయంలో చక్రం తిప్పాలని ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కు ఊహించని ఎదురీత ఎదురైంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ నిన్నటిరోజున భారతీయ జనతాపార్టీ కేంద్ర నాయకులను కలిసి అమరావతి రాజధాని తరలింపు విషయంలో వెంటనే కలగచేసుకోమని కోరుతుంటే పవన్ కు ఒక విచిత్ర సలహా బిజెపి కేంద్ర నాయకుల నుండి ఎదురౌతున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ చెపుతున్న విషయాలు అన్నీ చాల ఓపికగా విన్న ఢిల్లీ పెద్దలు ఈ విషయమై గట్టిగా పోరాటం చేయాలి అంటే వెంటనే ‘జనసేన’ ను బిజెపి లో విలీనం చేస్తే బాగుంటుంది కదా అంటూ సూచనలు ఇస్తూ ఉండటంతో పవన్ మైండ్ బ్లాంక్ అవుతున్నట్లు టాక్. దీనికితోడు ఢిల్లీలో పవన్ కు ఎదురౌతున్న జాతీయ మీడియా ప్రతినిధులు కూడ ‘జనసేన’ ను బిజెపి లో విలీనం చేస్తారా అంటూ అడుగుతున్న ప్రశ్నలకు పవన్ ఘాటైన సమాధానం ఇచ్చినప్పటికీ తీవ్ర అసహనానికి గురి అవుతున్నట్లు టాక్.

దీనితో జరుగుతున్న ఈ పరిణామాలు చూసి పవన్ తో ఇప్పటికే ‘పింక్’ రీమేక్ మొదలు పెట్టిన దిల్ రాజ్ అదేవిధంగా ఈనెల ముహూర్తం జరుపుకోబోతున్న క్రిష్ మూవీ నిర్మాత ఏ.ఎమ్. రత్నం విపరీతమైన టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ షూటింగ్ మొదలైతే క్రిష్ ప్రాజెక్ట్ కు అంతా లైన్ క్లియర్ అయింది అని అంటున్నారు. 

క్రిష్ ఈ మూవీని కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడ విడుదల చేసే పాన్ ఇండియా మూవీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ కు డిజైన్ చేసాడు. ఈ మూవీలో పవన్ పక్కన నటించబోయే ఇద్దరు హీరోయిన్స్ లో ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసి ఇప్పటికే ఆమెకు అడ్వాన్స్ కూడ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ నెల 27న ప్రారంభించే పరిస్థితులలో ప్రస్తుతం పవన్ కు ఢిల్లీలో ఎదురౌతున్న ఎదురీత అతడి మైండ్ సెట్ ను మార్చి ప్రస్తుతం ఓకె చేసిన ఈ రెండు సినిమాల విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అంటూ ఈ మూవీల నిర్మాతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: