అల్లు అర్జున్-త్రివిక్రం శ్రీనివాస్-పూజా హెగ్డే క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపుర్రములో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుక్న్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సంతోషంగా ఉన్నారు. సక్సస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నారు అల టీం. ఇక బన్నీ చాలా లాంగ్ గ్యాప్ తర్వా వచ్చిన సక్సస్ కావడంతో డబుల్ ఎనర్జీతో ఉన్నాడు. అయితే సడన్ గా బన్ని ఇంట విషాదం నెలకొంది. బన్ని మేనమామ .. ఏఏ 20 నిర్మాత ముత్తంశెట్టి ప్రసాద్ హఠాత్తుగా మరణించారు. ఓవైపు బన్ని అల వైకుంఠపురములో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సమమయంలో ఊహించని ఈ షాక్ అల్లు కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. బన్ని మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఉదయం విజయవాడలో కన్నుమూశారు. ఆయన తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. 

 

మేనమామతో బన్నీ అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలా దేవికి స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య. అకస్మాత్తుగా ఆయన కన్నుమూయడంతో అల్లు కుటుంబం పూర్తిగా షాక్ కి గురైంది. ఈ విషాద వార్త గురించి తెలుసుకున్న అల్లు కుటుంబం మొత్తం విజయవాడకు వెళ్లింది. 

 

బన్ని ఓవైపు ఏఏ20 కోసం సిద్దమవుతున్నాడు. ఈ సినిమా కోసం ముత్తంశెట్టి ప్రసాద్ నిర్మాతగానూ మారారు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఆయన నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్నారు. మేనమామ సినీఅరంగేట్రంపై బన్ని సహా అల్లు కుటుంబం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. మరోవైపు ముత్తంశెట్టి ఫ్యామిలీలో సైతం ఉత్సాహం నెలకొంది.  అందుకే అతని ఆకస్మిక మరణం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇక తమ సన్నిహితుడి మరణం మైత్రి సహనిర్మాత కలచి వేసింది. బన్ని ఇంట విషాదం .. నిర్మాత, మేనమామ హఠాన్మరణం..!

మరింత సమాచారం తెలుసుకోండి: