సరిలేరు నీకెవ్వరు’ ఊహించిన స్థాయిలో సక్సస్స్ కాలేకపోయినప్పటికీ ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్న మహేష్ దర్శకుడు అనిల్ రావిపూడిని ఒక్కమాట అనకుండా అతడికి ఓపెన్ గా హగ్ ఇచ్చి ప్రస్తుతం తన భార్యా పిల్లలతో విదేశాలలో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై మహేష్ కు లేనిబాధ బండ్ల గణేష్ కు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా కొనసాగుతున్న బండ్ల గణేష్ ను దర్శకుడు అనీల్ రావిపూడిని  తనకు తానుగా కెలికి చాలా ఏళ్ల తరువాత మళ్లీ మొహానికి మేకప్ వేసి కెమేరా ముందు  నిలబడేలా చేసాడు. ఈ అనుకోని అవకాశం తన కెరియర్ కు ఒక మలుపు తిప్పుతుందని బండ్ల గణేష్ భావించాడు. అయితే ‘సరిలేరు’ విడుదల తరువాత బండ్ల గణేష్ ఆశలు అన్నీ అడియాశలైపోయాయి. 

ఈసినిమాలో బండ్ల పాత్ర చాల దారుణంగా ఉంది అన్న కామెంట్స్ రావడమే కాకుండా ఇలాంటి చెత్త పాత్రను ఎందుకు అంగీకరించాడు అంటూ బండ్ల గణేష్ ను అతడి సన్నిహితులు అడుగుతున్నట్లు సమాచారం. దీనితో అసహనానికి లోనవుతున్న గణేష్ అనీల్ రావిపూడి తనను తప్పుదారి పట్టించాడు అంటూ గగ్గోలు పెడుతున్నట్లు టాక్. 

వాస్తవానికి విజయశాంతి బండ్ల గణేష్ లు వల్ల ఈ మూవీకి అదనపు క్రేజ్ ఏర్పడుతుంది అన్న వ్యూహంలో అనీల్ రావిపూడి వీరిద్దరిని అనీల్ రావిపూడి రంగంలో కిదింపాడు అని అంటారు. అయితే ఈ సినిమా కథలో ఉన్న లోపాలు వల్ల ఒక్క మహేష్ క్రేజ్ తప్ప మరి ఏవిషయం ఈ సినిమాను రక్షించలేకపోయాయి. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి సంబంధించి ఆఖరి అస్త్రంగా విడుదల చేసిన 200 పోష్టర్ తో ఈ మూవీ ప్రచారం ఇక ముగిసి పోయినట్లే. దీనితో మహేష్సినిమా పై బయటకు చెప్పుకోలేని అసంతృప్తిని బండ్ల గణేష్ వ్యక్తపరిచాడు అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: