టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా మాలీవుడ్ బ్యూటీలు ఎంట్రీ ఇవ్వడం.. వారికి లక్కీ కలిసి రావడం జరుగుతూనే ఉంది.  ఇప్పటి వరకు మాలీవుడ్ నుంచి వచ్చిన నటీమణుల్లో మంచి పాపులారిటీ సంపాదించింది నయనతార.  దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బ్యూటీ కూడా నయనతారనే కావడం విశేషం. ఇక కోలీవుడ్ నుంచి వస్తున్న హీరోయిన్ల శాతంకూడా బాగానే ఉంది.  బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దర్శక, నిర్మాతలకు తక్కువలో వచ్చే అందగత్తెలు ఎక్కడా అంటే బాలీవుడ్ వైపే చూస్తుంటారు. ఈ మద్య కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న రష్మిక లాంటి బ్యూటీలకు కూడా అదృష్టం కొద్ది తెలుగు, తమిళ భాషల్లో ఛాన్సులు వస్తున్నాయి.  

 

తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి మూవీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్.  గతంలో కీర్తి సురేష్ తల్లి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘పున్నమి నాగు’ మూవీలో నటించింది.   కీర్తి సురేశ్, సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచే వచ్చింది. ఆమె తండ్రి కూడా ఒక స్టార్ డైరెక్టర్ కావడం విశేషం. అప్పట్లో ఆమె రజనీకాంత్ సరసన 'నేత్రిక్కన్' అనే సినిమా చేశారు. ఆ సినిమా రజనీ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఇంతకాలానికి ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

తాజాగా ఈ మూవీ రీమేక్ చేయాలనే ఆలోచన ధనుశ్ కి రావడం.. అనుకున్నదే ఆలస్యం రంగంలోకి దిగిపోవడం కూడా జరిగిపోయిందట. రజనీ చేసిన పాత్రను ధనుశ్ పోషించనుండగా, మేనక ధరించిన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ సినిమాను ధనుశ్ తన సొంత బ్యానర్లో నిర్మించనున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలియజేయనున్నారు. గతంలో ఈ జంట ‘రైల్’ మూవీలో నటించారు. మరి ఈ జంట.. ఆ జంటను మెప్పించేలా చేస్తారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: