బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. దాంతో ప్ర‌భాస్ ఏ చిత్ర‌మైనా స‌రే ప్యాన్ ఇండియా మూవీలానే తియ్యాల‌నుకుంటున్నాడు. బ‌డ్జెట్‌కి ఎక్క‌డా కూడా వెన‌కాడ‌కుండా ముందుకు వెళుతున్నాడు. అయితే ఇటీవ‌లె ఆయ‌న న‌టించిన సాహో చిత్రం కూడా హై బ‌డ్జెట్ తోనే వ‌చ్చింది. కానీ క‌థ‌లో బ‌లం లేదు. అలాగ‌ని క‌లెక్ష‌న్లుకు కూడా ఎటువంటి ఢోకా లేకుండా మంచి హిట్ కొట్టింద‌నే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే. ప్ర‌భాస్ రేంజ్ దీంతో మారిపోయింద‌నే చెప్పాలి. ఇక ప్ర‌స్తుతం న‌టించ‌బోయే త‌న 20వ చిత్రం పై కూడా అదే విధంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రం ఇప్ప‌టికే మొద‌ల‌వ్వాల్సిందే. ఎందుకోగాని ప్ర‌భాస్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం ప్ర‌భాస్ అప్‌డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 

 


అయితే ఈ సినిమా మెయిన్  లైన్ ఏమిటి అన్నది ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఒక పాత కాలపు నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. కానీ ఇప్పుడు అది ఒక నార్మ‌ల్ ల‌వ్ స్టోరీగా  ఉండబోతుంది అని ఆయ‌న అన్న దానికి సంబంధించి నేరుగా దర్శకుడే చెప్పిన‌ట్లు వార్తలొస్తున్నాయి.”ఈ విష‌యాన్ని ఆయ‌న ఫ్యాన్సే నేరుగా చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇది ఒక పీరియాడిక్ సినిమా లాంటిది కాదనీ మన భార‌త దేశానికి సంబంధించిన‌ మొట్ట మొదటి ప్రేమ కథ లాంటిది అని అలాగే ప్రభాస్ మరియు పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంటుంద‌ని స‌మాచారం.  

 


ఇక ఈ చిత్రం ఖచ్చితంగా ఆడియన్స్ కు ట్రీట్ లా ఉండడమే కాకుండా సినిమా మొత్తం కూడా ఒక విజువల్ వండర్ లా ఉంటుంది” అని రాధా కృష్ణ తెలిపినట్టుగా ప్రభాస్ అభిమానులే ప్రచారం చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ ఈ మ‌ధ్య కాలంలో ల‌వ్ అండ్ రొమాంటిక్ మూవీస్ చేసి చాలా కాల‌మే అయింది.  మ‌రి ఈచిత్రంలో ప్ర‌భాస్‌ని రాధాకృష్ణ రొమాంటిక్ యాంగిల్ లో ఎలా చూపించ‌బోతున్నాడో చూడాలి మ‌రి. అందులోనూ ఈ చిత్రం కూడా ఒక విజువ‌ల్ వండ‌ర్ అంటే తెర‌మీద చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: