పవన్ కళ్యాణ్ తో సినిమాను తీయాలి అంటే ఆ మూవీ దర్శక నిర్మాతలకు విపరీతమైన సహనం ఉండాలి. దీనితో పవన్ ఎంతో క్రేజ్ ఉన్న అతడి మూడ్స్ తట్టుకోలేక అతడితో సినిమాను చేయడానికి చాలామంది భయపడిపోతారు. 

అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడమే ధ్యేయంగా కలలు కంటూ ‘పింక్’ రీమేక్ ను మొదలుపెట్టిన దిల్ రాజ్ కు పవన్ కళ్యాణ్ విమాన ఖర్చుల మోత హడల్ పుట్టిస్తున్నట్లు టాక్. వాస్తవానికి పవన్ ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ ఇచ్చే సమయానికి అమరావతి వివాదం పీక్ కు చేరుకోలేదు. 

అయితే ఇప్పుడు అమరావతి వివాదం క్లైమాక్స్ కు చేరుకోవడంతో పాటు రాజకీయంగా పవన్ తన స్పీడ్ ను పెంచడంతో అతడి సమయం ప్రతిరోజు ‘పింక్’ కు రాజకీయ కార్యకలాపాలకు మధ్య కేటాయించ వలసిన పరిస్థితి ఏర్పడింది. దీనితో పవన్ మూడ్ మారిపోకుండా ‘పింక్’ ను మొదలు పెట్టడానికి దిల్ రాజ్ హైదరాబాద్ నుండి విజయవాడకు అలాగే విజయవాడ నుండి ఢిల్లీకి పవన్ కోసం అనీ ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా రీమేక్ కు సంబంధించి పవన్ కు 50 కోట్ల పారితోషికం బిజినెస్ లో షేర్ ఆఫర్ చేసిన దిల్ రాజ్ కు ఇప్పుడు పవన్ ఇలా అమరావతి వ్యవహారంలో బిజీగా ఉంటూ వరసపెట్టి చేస్తున్న ఈ ప్రత్యేక విమాన ఖర్చులు ఎన్నికోట్లకు చేరిపోతాయో అంటూ దిల్ రాజ్ తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి పవన్ ఇలా కొంత కాలం అమరావతి వ్యవహారం తేలే వరకు హైదరాబాద్ అమరావతిల మధ్య తిరుగుతూనే ఉంటాడు. దీనితో దిల్ రాజ్ అనుమాన పడుతున్న భయాలు నిజం అయితే ఈ మూవీని ఏ రేట్లకు అమ్మి బయటపడాలో దిల్ రాజ్ కు కూడ తెలియని పరిస్థితి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: