‘ప్రస్థానం’ సినిమా విడుదల తరువాత దర్శకుడు దేవా కట్టా టాప్ రేంజ్ డైరెక్టర్ గా మారిపోతాడు అని చాలామంది భావించారు. అయితే ఆ తరువాత ఇతడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో టోటల్ ఫెయిల్యూర్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఒక ముద్ర వేయించుకున్నాడు.

ఇతడు తీసిన ‘ప్రస్థానం’ నచ్చి సంజయ్ దత్ బాలీవుడ్ లో ఈ సినిమాను రీ మెక్ చేసినా ఆ మూవీ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఈ డైరెక్టర్ కు ఉన్న దారులు అన్నీ మూసుకు పోయాయి. ఇలాంటి పరిస్థితులలో ఇతడిని నమ్మి చిరంజీవి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను ఈ డైరెక్టర్ చేతిలో పెట్టాడా అంటూ వార్తలు గుప్పు ముంటున్నాయి. వాస్తవానికి ‘ప్రతిరోజు పండగే’ మూవీ సూపర్ సక్సస్ తరువాత సాయి తేజ్ కు చాల ఆఫర్లు వస్తున్నాయి. 

అయితే తాను ఒప్పుకునే సినిమా కథల విషయంలో మళ్ళీ పొరపాట్లు చేయడం ఇష్టంలేక ఇప్పుడు తేజ్ తన సినిమా కథల ఎంపిక నిర్ణయాన్ని చిరంజీవికి అప్పచెప్పినట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో దేవా కట్ట ఈమధ్య చిరంజీవికి చెప్పిన ఒక లైన్ బాగా నచ్చడంతో ఆ కథకు సాయి ధరమ్ తేజ్ బాగా సరిపోతాడని భావించి ఆ లైన్ ను కథగా మార్చమని ఈ దర్శకుడుకి చిరంజీవి సలహా ఇచ్చినట్లుగా వార్తలు గుప్పు మంటున్నాయి. 

దీనితో మంచి హిట్ ట్రాక్ మీద ఉన్న సాయి ధరమ్ తేజ్ మరొకసారి అనవసరపు ప్రయోగాలు చేస్తున్నాడా అంటూ ఇండస్ట్రీలో  కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. గతంలో కూడ సాయి ధరమ్ తేజ్ ఇలా ఫెయిల్యూర్ డైరక్టర్లకు అవకాశాలు ఇచ్చి అనవసరంగా ఫ్లాప్ హీరో ముద్రను వేయించుకున్నాడు. అయితే ‘ప్రతిరోజు పండగే’ విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ సాయి ధరమ్ తేజ్ కు కలిసి రావడంతో తిరిగి మళ్ళీ సెంటిమెంట్ ను మెగా మేనల్లుడు రిపీట్ చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: