టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం అఖిల్ అంతగా ఆకట్టుకోలేక పోతున్నాడు. డాన్సులు అందం విషయంలో బాగానే ఉన్నప్పటికీ అఖిల్ ఎంచుకునే సినిమాల్లో మాత్రం ఎక్కడో తేడా కొట్టేస్తోంది. దీంతో ఎ ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అఖిల్ కు  మాత్రం నిరాశే ఎదురవుతోంది.దీంతో  అఖిల్ కెరియర్ బాధ్యతను నాగార్జున చేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ప్రస్తుతం అఖిల్ పూజా హెగ్డే జంటగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

 

 

లవ్ స్టోరీ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా జత కలిపి తెరకెక్కించడంలో బొమ్మరిల్లు భాస్కర్ కు మంచి పేరు ఉంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అఖిల్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాగా ఈ షెడ్యూల్లో అక్కినేని అఖిల్ టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే మధ్య  రొమాంటిక్ సాంగ్ తో పాటు నాలుగు లవ్ సీన్స్ కూడా చిత్రీకరించారట దర్శకుడు. అయితే ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే కి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని... ముఖ్యంగా లవ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి అని టాలీవుడ్ వర్గాల్లో  చర్చించు కుంటున్నారు. 

 

 

ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకుల మనసు హత్తుకు పోయేలా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా... ఈ సినిమాలో దేవిశ్రీ అందించిన మ్యూజిక్ యూత్ అందరూ ఉర్రూతలూగి పోతారట. ఇటీవలి వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజాహెగ్డే.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్ కు  జోడి కట్టగా ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా చూడాలి మరి. ఈ సినిమాపై అటు  అఖిల్ తో పాటు నాగార్జున కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: