2005వ సంవత్సరంలో నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు కలిసి 'వంశీ' సినిమాలో నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాంతో 2005వ సంవత్సరంలోనే వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే తమ వివాహ అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పగా.. మహేష్ బాబు మాత్రం ఎన్నో సినిమాలు తీసి సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవ వేడుకలన్నీ జరుపుకున్న తర్వాత మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ కి వెళ్లి తన హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

 

 

కాగా రెండు నెలల తర్వాత మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ఇండియాకి తిరిగి రానున్నాడని తెలుస్తుంది... అయితే మహేష్ బాబు ఇండియాకి తిరిగి రాగానే దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా తీసేందుకు సిద్ధమవుతాడు. వాస్తవానికి వంశీ పైడిపల్లి మహేష్ బాబు మహర్షి సినిమాని తెరకెక్కించాడు. మళ్లీ అతనితోనే మహేష్ బాబు తన తదుపరి సినిమా తీసేందుకు అంగీకరించడంతో.. ఈ రాబోయే సినిమాకు సంబంధిత విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.

 

 

ఈ క్రమంలోనే.. ఒక  ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే భార్య నమ్రత... కబీర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వాని తన భర్త మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తే చూడాలని ఆమె ముచ్చట పడుతుందట. అందుకే వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలో కియారా అద్వానిని హీరోయిన్ గా తీసుకోమని దర్శకుడు వంశీ పైడిపల్లిని కోరిందట.

 

 

గతంలో భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన కియారా అద్వానీ నటించిన సంగతి విదితమే. అయితే, వెండితెరపై మహేష్ బాబు కు కియారా అద్వానీ పర్ఫెక్ట్ జోడి అని అనుకుందేమో కానీ ప్రస్తుతం నమ్రత వంశీ పైడిపల్లిని ఈ విధంగా అడగటం చర్చనీయాంశమైంది. ఇకపోతే, ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీత బాణీలు అందించనున్నాడని సమాచారం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: