డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో హీరోగా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రవితేజ.  కెరీర్ బిగినింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన రవితేజ వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు.  కృష్ణవంశి తెరకెక్కించి సింధూరం మూవీలో రవితేజ యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత హీరోగా మారిన రవితేజ మాస్ ఫాలోయింగ్ బాగా సంపాదించారు. బెంగాల్ టైగర్, కిక్ 2 మూవీస్ దారుణమైన డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.  ప్రస్తుతం ఐ.వి.ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ మూవీలో నటిస్తున్నారు. 

 

మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి ఎలాంటి కట్స్  లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో రవితేజ సరసన హీరోయిన్లుగా  ' పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ నటించారు. అయితే వరుస పరాజయాలు పొందుతున్న మాస్ మహరాజా  రవితేజకు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే మాస్ మహారాజా నటించిన గత మూడు సినిమాలు కూడా దారుణమైన పరాజయాన్ని చవిచూశాయి.  ప్రోమోలు, పాటలు చాలా కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజు విడుదల చేసిన ఫ్రీక్ అవుట్ అయితే స్టాండౌట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

 

అంతా బాగుంది.. కానీ ఇప్పుడు రవితేజ మాత్రం టెన్షన్ లో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుస గుస.   ఒక వైపున 'సరిలేరు నీకెవ్వరు'..'మరో వైపున 'అల వైకుంఠపురములో' సినిమాలు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన పెద్ద హీరోల సినిమాలతో ఢీ కొట్టాలంటే ఈ మూవీ ఫస్ట్ షోనే హిట్ టాక్ తెచ్చుకోవాలి.. లేదంటే మాస్ రాజ కష్టాల్లో పడ్టటే అంటున్నారు ఫిలిమ్ వర్గాలు.   హిట్ టాక్ రాకుంటే.. కష్టాలు తప్పవంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: