సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల మధ్య సృష్టింప బడ్డ రగడ ఈమధ్య కాలంలో ఏ టాప్ హీరోల సినిమాల మధ్య సృష్టింప బడలేదు. దీనితో ఈ మూవీల నిర్మాతలతో పాటు ఈ మూవీల హీరోలు వారి అభిమానులు ఈ రెండు సినిమాలకు సంబంధించిన కలక్షన్స్ ఫిగర్స్ లో ఎంత వరకు మ్యాజిక్ చేయాలో అంత వరకు మ్యాజిక్ చేసి ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను కన్ఫ్యూజ్ చేసారు. 

రాబోతున్న వీకెండ్ తో ఈ రెండు సంక్రాంతి సినిమాల హడావిడి ఇంచుమించు పూర్తి అయిపోతుంది. కొంత వరకు వచ్చే వారం నుండి ‘అల వైకుంఠపురములో’ కలక్షన్స్ హడావిడి కొద్దిగా కనిపించినా అది కూడ ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చు. 

దీనితో ఈ రెండు సినిమాలకు సంబంధించి అసలు వాస్తవంగా వచ్చిన కలక్షన్స్ ఫిగర్స్ ఏమిటి అన్న విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నా ఈ రెండు సినిమాల నిర్మాతలు డార్క్ సీక్రెట్ ను కొనసాగించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫిగర్స్ మేనేజ్మెంట్ ఈ సినిమాలు ప్రదర్శించే ధియేటర్ల నుండి గ్రాస్ లెవల్ లోనే మేకప్ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ రెండు సినిమాల వెనక ఉన్న వ్యక్తులు దిల్ రాజ్ అనీల్ సుంకర అల్లు అరవింద్ హారికా హాసినీ రాథాకృష్ణ వరసగా సినిమాలు తీసే పెద్ద వ్యక్తులు కావడంతో వారితో శతృత్వం ఎందుకని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాలకు సంబంధించిన రియల్ ఫిగర్స్ దాచేస్తున్నట్లు టాక్. దీనితో ఈ రెండు సినిమా నిర్మాతలు ఎవరికి వారే తమ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది అంటూ చేస్తున్న హడావిడితో అనుభవం ఉన్న ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్య పడుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: