టాలీవుడ్ లో చిత్రం మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయిన తేజ తర్వాత ‘జయం’ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరో నితిన్, సదా. ప్రేమ కోసం ఓ పేద యువకుడు చేసిన పోరాటం ఇతవృత్తంగా ఈ మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది. ఈ మూవీ తర్వాత తేజ ఎన్నో సినిమాలు తీశారు.. కానీ ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. దాంతో కొంత కాలం చాలా సైలెంట్ గా ఉన్నారు. ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చినా.. తర్వాత ఆయన బ్యాక్ వెళ్లిపోయారు.
ప్రముఖ నిర్మాత డి రామానాయుడు మనవడు... డి. సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి ‘లీడర్’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా మంచి హిట్ అయ్యింది. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే హీరో ఇమేజ్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని రానా ఎలాంటి పాత్రలకైనా సిద్దం అయ్యారు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 మూవీస్ లో ప్రతినాయకుడిగా దుమ్మురేపాడు రానా. ఈ మూవీకి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. ఇక తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ‘నేనే రాజు... నేనే మంత్రి ’ మూవీతో రానా సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ మూవీతో తేజకు కూడా మంచి బూస్టింగ్ వచ్చింది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. రానా ప్రధాన పాత్రధారిగా తేజ ఒక విభిన్నమైన కథను రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాలో రానా పాత్రను చాలా విలక్షణంగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు'అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. డిఫరెంట్ టైటిల్స్ తో వస్తున్న తేజ, రానా ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకోవాలని రానా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాకపోతే ఈ విషయం మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు.