మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా మరో హీరో వస్తున్నాడని తెలిసిందే. అతను ఎవరో కాదు సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. అయన హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఆలాగే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
జాలర్ల నేపథ్యంలో తెరకెక్కతున్న ఈచిత్రంలో ప్రముఖ
తమిళ నటుడు
విజయ్ సేతుపతి విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే
మెగాస్టార్ చిరంజీవి నటించిన
సైరా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఉప్పెన తో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నాడు. . రాక్ స్టార్ దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. ఆమె కు కూడా ఇదే మొదటి సినిమా. సుమారు 20కోట్లబడ్జెట్ తో
సుకుమార్ సొంత బ్యానర్ ,సుకుమార్ రైటింగ్స్ తోకలిసి మైత్రి
మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇదిలా ఉంటే శ్రీమంతుడు తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రి ఆతరువాత జనతా గ్యారేజ్ , రంగ స్థలం తో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించింది. అయితే ఆ సినిమాల తరువాత ఈ సంస్థ నిర్మించిన
సవ్యసాచి ,
అమర్ అక్బర్ అంటోని ,డియర్ కామ్రేడ్ డిజాస్టర్లు అయ్యాయి. మధ్యలో
చిత్రలహరి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ ఉప్పెన ,మైత్రి కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.