ముందు మంచి కమెడియన్ గా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన సునీల్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశారు. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి. కొన్ని దారుణంగా ఫ్లాపయ్యి నిర్మాతకు నష్టాలని మిగిల్చాయి. దాంతో సునీల్ కి హీరోగా అవకాశాలు రావడం బాగా తగ్గు ముఖం పట్టాయి. దాంతో సునీల్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రం మళ్ళీ కమెడియన్ గా ఛాన్సులిచ్చారు. వాటితో మెల్లగా మళ్ళీ పాపులర్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అనారోగ్యానికి గురయ్యారని ఈ రోజు గచ్చిబౌళి గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. ఈ విషయం సోషల్ మీడిఒయాలో కేవలం గంట రెండు గంటల్లోనే వైరల్ గా మారాయి. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించారని ప్రచారమైంది. ఇది సునీల్ కి చేరడంతో ఈ విషయమై ఆయన స్వయంగా స్పందించారు.

 

తన గొంతు నొప్పి తో బాధ పడుతున్నానని.. సైనస్ తో సహా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల గత వారం రోజులుగా జ్వరం తో బాధ పడుతున్నానని సునీల్ వెల్లడించారు. డాక్టర్ సలహా మేరకు మాదాపూర్ ఏ.ఐ.జి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నానని తెలిపారు. యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల లంగ్స్ అండ్ త్రొట్ లో ఇన్ఫెక్షన్ అయ్యిందని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని తెలిపారు. అయితే ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని నేను బాగానే ఉన్నాని అనవసరమైన వార్తలు క్రియోట్ చేయొద్దని ఇన్‌డైరెక్ట్ గా చెప్పారు. 

 

అరవింద సమేత సినిమాలో కమెడియన్ గా మంచి పాత్ర పోషించిన సునీల్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన 'డిస్కోరాజా' లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఇక ఈ సినిమా తర్వాత 'కలర్ ఫోటో' అనే సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోగా అవకాశాలు వచ్చినప్పటికి సునీల్ ఎందుకనో గత కొంతకాలంగా ఆ అఫర్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలోను మంచి పాత్ర పోషించారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: