టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు అప్పట్లో అజ్ఞాతవాసి సినిమాతో భారీ ఫ్లాప్ ని చవిచూసిన త్రివిక్రమ్ కు చాలావరకు ఊరటనిచ్చింది. ఇకపోతే ఆ సినిమా తరువాత టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ లో నటించడానికి సిద్ధం అయిన ఎన్టీఆర్, ఆ తరువాత నుండి అదే సినిమాకు మాత్రమే పని చేస్తున్నారు. ఎంతో గొప్పగా తెరకెక్కుతున్న అంత గొప్ప ప్రాజక్ట్ జరుగుతున్నపుడు మరొక సినిమా ఒప్పుకోకూడదని గట్టిగా నిర్ణయించారు ఎన్టీఆర్. 

 

అయితే ఇప్పుడు ఇదే ఆయన ఫ్యాన్స్ ను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చి ఏడాదికి పైగా గడిచిపోయిందని, ఇక మరోవైపు ప్రచారం అవుతున్న వార్తలను బట్టి ఆర్ఆర్ఆర్ కనుక దసరాకు వాయిదా పడ్డట్లయితే, మొత్తంగా అప్పటికి ఆయన నుండి సినిమా వచ్చి సరిగ్గా రెండేళ్లు అవుతుందని అంటున్నారు. ఇక ఈ విధంగానే టాలీవుడ్ మరొక హీరో అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పరిస్థితి కూడా తయారయినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. గత ఏడాది ఆగష్టు లో ప్రభాస్ నటించిన సాహో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఆ తరువాత ఆయన జాన్ అనే సినిమాలో హీరోగా నటించడానికి సిద్ధం అయ్యారు. 

 

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాని 2021 వేసవిలో రిలీజ్ చేస్తాం అని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు మొన్న తన పుట్టినరోజు సందర్భంగా మీడియాకు తెల్పడం జరిగింది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ సినిమాలో గ్రాఫిక్ వర్క్ ఒకింత ఎక్కువగా ఉండడంతో ఆ సినిమా పూర్తి అయ్యేసరికి వచ్చే ఏడాది జులై వరకు సమయం పెట్టొచ్చని వార్తలు కూడా వినపడుతున్నాయి. అదే కనుక జరిగితే, ఇటు ఎన్టీఆర్ మాదిరి అటు ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ కు రెండేళ్ల పాటు దూరం అయినట్లే అంటున్నారు. అయితే జాన్ షూటింగ్ విషయమై ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: