టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి మరియు లేటెస్ట్ గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. దీంతో తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా మహేష్ బాబు హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నట్లు గతంలో కొరటాల శివ దర్శకత్వం లో 'భరత్ అనే నేను' సినిమా లో నటించిన కియారా అద్వానీ నీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని మహేష్ పట్టు పడుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

 

వరుస విజయాలతో ఈ ఏడాదిలోనే అదిరిపోయే బ్లాక్ మాస్టర్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో 200 కోట్లు కలెక్షన్లు కలెక్ట్ చేసిన మహేష్ బాబు అదే స్పీడ్ కొనసాగించాలని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ విషయంలో మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు భవిష్యత్తులో మహేష్ చేయబోయే ప్రతి సినిమా విషయంలో నమ్రతా శిరోద్కర్ వెనకనుండి నడిపించ నున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబ సమేతంగా న్యూయార్క్ టూర్ లో ఉన్నట్లు తిరిగి స్వదేశానికి వచ్చాక తర్వాత చేయబోయే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ లో టాక్. మరోపక్క మహేష్ అభిమానులు వరుసగా మహేష్ విజయాలు సాధిస్తూ హ్యాట్రిక్ కొట్టడంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా లో అదిరిపోయే డ్యాన్స్ తో పాటు మాస్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టే రీతిలో చేయటంతో బాక్సాఫీస్ రికార్డుల మీద రికార్డులు 'సరిలేరు..' క్రియేట్ చేస్తున్న తరుణంలో నెక్స్ట్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: