టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. నిజానికి సినిమాలో సెకండ్ హాఫ్ కొంత లెంగ్త్ ఎక్కువ అవడంతో పాటు, సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లుగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు అనిల్ సినిమాని నడిపించలేకపోయాడు అనే విమర్శలు సినిమాపై వచ్చాయి. అయితే మహేష్ బాబు చాలా గ్యాప్ తరువాత మంచి ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఉన్న రోల్ లో నటించడంతో పాటు సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాకు బాగానే కలెక్షన్స్ దక్కాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది. 

 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా పెద్దగా గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా ఏమి కాదు అనే అనాలి. తన గత సినిమాల్లోని కొన్ని సీన్స్ ని ఇందులో రిపీట్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలతో పాటు మంచి పంచ్ డైలాగ్స్ ని పొందుపరచడం, అలానే సంక్రాంతి పండుగ సెలవలు కావడంతో సినిమాకు మంచి కలెక్షన్ రావడం జరిగింది. ఇక ఇటీవల ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒకరిని మించేలా మరొకరు మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, 

 

అంత కలెక్ట్ చేసింది అంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తుండడం గమనించవచ్చు. ఇక రెండు రోజుల క్రితం సరిలేరు టీమ్ తమ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుందని పోస్టర్ రిలీజ్ చేయగా, వెంటనే ఆ తెల్లారి అల మూవీ టీమ్, తమ సినిమా రూ.220 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇకపోతే నిన్న సాయంత్రం సరిలేరు సినిమా యూనిట్ ఒక ప్రెస్ పెట్టగా, కలెక్షన్స్ విషయమై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ఇకపై తమ సినిమా కలెక్షన్ కి సంబంధించి పోస్టర్స్ ప్రచురించడం ఉండదని, ఓవరాల్ గా సినిమాకు వచ్చే క్లోసింగ్ కలెక్షన్స్ మాత్రమే చివర్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ విధంగా ఒక్కసారిగా సరిలేరు టీమ్, అల మూవీ టీమ్ కి షాకిచ్చిందనే చెప్పాలి. ఆ విషయం అటుంచితే, సరిలేరు టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ఈ రెండు సినిమాల మధ్య పోస్టర్ల ద్వారా జరిగే కలెక్షన్స్ వార్ కు తెరపడ్డట్లైందని అంటున్నారు ప్రేక్షకులు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: