టాలీవుడ్ బ్యూటి స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ సినిమా 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మూడు ప్రధాన భాషల్లో తెరకెక్కించారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ రిలీజ్ కి సిద్దమయిన ఈ సినిమాను రచయిత కోన వెంకట్ నిర్మించారు. ఈ సినిమాలో అనుష్క తో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండేలు కీలక పాత్రల్లో నటించారు. అంతేకాదు హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడిసన్ ఒక అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాను జనవరి 31న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా నిర్మాత కోన వెంకట్ ఇది వరకే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలా అనిపించడం లేదనిపిస్తోంది.
ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికి చిత్రయూనిట్ ఇంత వరకు ప్రమోషన్స్ ని మొదలు పెట్టనే లేదు. ఈ సినిమాలోని క్యారెక్టర్ పోస్టర్స్తో పాటు టీజర్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తరువాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక తాజా పరిణామాలను బట్టి చూస్తే జనవరి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమని తెలుస్తోంది. ఇక నితిన్ అశ్వద్థామ రిలీజ్కు రెడీ అవుతు వరుస ఇంటర్వ్యూల, ప్రమోషన్ కార్యక్రమాలతో హడావిడి చేస్తుంటే నిశ్శబ్దం టీం మాత్రం నిశ్శబ్దం గా ఉన్నారు. అదే రోజున వస్తున్న నితిన్ సినిమాతో పోటీ ఎందుకు ఒక సోలో డేట్ చూసుకుందామని ఆగారా లేక ఇంకేదైనా కారణమా అన్నది చిత్ర యూనిట్ నుండి ఏదైనా అప్డేట్ వస్తే తెలుస్తుంది.
అయితే ఈ సినిమా విషయంలో రకరకాల వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. అనుష్క లుక్ విషయంలో మేకర్స్ సంతృప్తిగా లేరని అందుకే గ్రాఫిక్స్లో స్వీటిని కాస్త స్లిమ్గా చూపిండానికి ట్రై చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు సినిమాను కొనేందుకు బయ్యర్స్ ఇంట్రస్ట్ చూపించటం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి అసలు కారణాలు ఏంటో కోన టీం క్లారిటీ ఇస్తేగాని అందరికి అర్థం అవదు.